E-Paper
Advertisement

IT Raids : మూడోరోజూ ఐటీ దాడులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో సోదాలు..

IT Raids : మూడోరోజూ ఐటీ దాడులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో సోదాలు..
Advertisement

Income Tax raids in Telangana(Telugu breaking news today): తెలంగాణలో మూడో రోజూ ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. హోటల్‌ ఎట్‌ హోమ్‌, వైష్ణవి గ్రూప్‌ స్థిరాస్తి సంస్థ వాటి అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు, సీఈవోలు, డైరెక్టర్ల ఇళ్లలోనూ క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

Advertisement

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. పన్ను చెల్లింపులకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో చేపట్టిన సోదాల్లో 70 ఐటీ బృందాలు పాల్గొన్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా జరుగుతున్న ఐటీ శాఖ దాడులు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. రెండోరోజు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు చేశారు. మైలాన్ డిజిటల్ టెక్నాలజీలో కొత్త ప్రభాకర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి భాగస్వాములుగా ఉన్నట్లు ఐటీ అధికారులు నిర్ధారించారు.

Advertisement

ముగ్గురు నేతలు కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని గుర్తించారు. నేతల సతీమణులు, కుటుంబ సభ్యులు డైరెక్టర్స్‌గా ఉన్న కంపెనీలపై దృష్టిపెట్టారు. బ్యాంకు లాకర్స్‌ను సైతం ఓపెన్ చేసిన ఐటీ అధికారులు పలు కీలక పత్రాలు, సమాచారం సేకరించారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×