BigTV English

US: అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి దుర్మరణం.. కుటుంబంలో విషాదం

US: అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి దుర్మరణం.. కుటుంబంలో విషాదం
usa gun firing

US: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.. గ్యాస్ స్టేషన్‌లో పార్ట్ టైం జాబ్‌ చేస్తున్న వీర సాయిష్‌ని దుండగులు కాల్చిచంపారు. విద్యార్థి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు… ఎమ్మెస్‌ చదివేందుకు అమెరికా వెళ్లిన సాయిష్‌ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరో నెలరోజుల్లో చదువు పూర్తి చేసుకునే సమయంలో వీర సాయిష్ ఇలా ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు. సాయిష్ ఇటీవలే హెచ్ 1 బీ వీసా దక్కించుకున్నాడు. రెండు వారాల్లో బంక్‌లో ఉద్యోగం మానేద్దామని కూడా సాయిష్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది.


అమెరికాలోని వెస్ట్ కొలంబస్‌లోని గ్యాస్ స్టేషన్‌లో వీర సాయిష్‌ పార్ట్‌ టైం జాబ్ చేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి స్టేషన్‌ వద్దకు వచ్చిన దుండగులు దోపిడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన సాయిష్‌పై కాల్పులు జరిపి డబ్బులతో పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీర సాయిష్‌ను ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. అనుమానితుడి ఫోటోలు విడుదల చేశారు కొలంబస్ పోలీసులు. వీరసాయిష్‌ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు అతని స్నేహితులు ఆన్‌లైన్‌ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమం చేపట్టారు.

పాలకొల్లుకు చెందిన సాయిష్ కుటుంబం కొద్ది కాలం క్రితం ఏలూరులో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో సాయిష్ తండ్రి కూడా మృతిచెందాడు. తండ్రి చివరి కోరిక తీర్చడానికి వీరా సాయిష్‌ అమెరికా వెళ్లాడు. మరో మూడు నెలల్లో చదువు పూర్తవుతుందని అనుకుంటున్న సమయంలో సాయిష్‌ దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. కొద్ది రోజుల్లో తిరిగి వస్తాడనుకున్న సాయిని దారుణంగా హత్యచేశారని తల్లి వీరా జయశ్రీ కన్నీరుమున్నీరయ్యారు. చేతికందిన కొడుకు ఇలా అవుతాడు అనుకోలేదంటూ బోరున విలపించారు.


Related News

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

Big Stories

×