’The World’ largest Cruise ship in Vizag: ప్రపంచాన్ని చుట్టేస్తున్న ’ది వరల్డ్’ ప్రైవేటు క్రూయిజ్ షిప్ విశాఖకు చేరుకుంది. రెండురోజుల విశాఖలో ఈ షిప్ ఉండనుంది.
ప్రపంచవ్యాప్తంగా ఐదు ఖండాలు, 120 దేశాలను చుట్టేయనుంది. ఈ నౌకలో వందకు పైగా కుటుంబాలు ప్రపంచ యాత్ర చేస్తున్నాయి. అతిపెద్ద రెసిడెన్షియల్ యాచ్ క్రూయిజ్ టెర్మినల్కు చేరుకుంది.
ఇందులో 167 విలాసవంతమైన నివాసాలను కలిగి ఉన్నాయి. ఇక విలాసాలకు కొదవలేదు. బయట విలాసవంతమైన ఇళ్లకు ఎలాంటి సదుపాయాలు ఉంటాయో అవన్నీ దీని సొంతం. టికెట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది.
ప్రపంచాన్ని అంతా ఇందులోనే చూడొచ్చు. రెండేళ్ల కిందట విశాఖకు క్రూయిజ్ షిప్లు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ది వరల్డ్ నౌక రావడటానికి కారణంగా చెబుతున్నారు.
విశాఖ పోర్ట్ కు మొట్టమొదటి సారిగా చేరుకున్న 'ది వరల్డ్' ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్. దాదాపుగా 80 మంది ప్రయాణికులతో విశాఖకు రాక. నగరంలో పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్న ప్రయాణికులు. #AndhraPradeshElections2024#AndhraPradesh #Vizag #Visakhapatnam pic.twitter.com/lp2YmBdhA5
— Vizag News Man (@VizagNewsman) April 28, 2024