E-Paper
Advertisement

Tirumala News: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో శ్రీవారి డాలర్లు, ఇంకెందుకు ఆలస్యం

Tirumala News: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో శ్రీవారి డాలర్లు, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Tirumala News: తిరుమల తిరుపతి దేవస్థానం రూటు మార్చింది. ఒకప్పుడు తిరుమలకు వెళ్లడం కష్టంగా కనిపించేది. ఇప్పుడు స్వామి దర్శనం మరింత తేలికైంది. తాజాగా భక్తులకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి డాలర్లు ఆన్‌లైన్‌లో భక్తులు కొనుగోలు చేసే పద్దతి తీసుకురానుంది. దీనికి సంబంధించి తెరవెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి.

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ. దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి బంగారం, వెండి డాలర్లు కొనుగోలు చేయడం ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఆ తరహా డాలర్లు కేవలం తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉండేవి. లేటెస్ట్ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు శ్రీవారి బంగారు, వెండి డాలర్లను ఆన్‌లైన్‌లో అందించేందుకు రెడీ అవుతోంది. దీనిల్ల టీటీడీకి ఆదాయం కూడా పెరగనుంది. దీనిపై ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక మేరకు శ్రీవారి డాలర్ల విక్రయాలను మరింత పెంచాలని సిఫార్సు చేసిన నేపథ్యంలో చర్యలు చేపట్టింది.

తిరుమలలో కౌంటర్‌లో శ్రీవారి డాలర్లు విక్రయిస్తారు. ఇకపై బంగారం, వెండి పెండెంట్లు, డాలర్లతోపాటు బంగారు, వెండి నాణేలను ఆన్‌లైన్‌లో విక్రయించాలని నిర్ణయించింది. భక్తులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన తర్వాత పోస్టల్ ద్వారా పంపించాలని ప్రణాళికలు వేసింది. డాలర్లకు సంబంధించి వ్యవహారం కావడంతో భద్రతకు ప్రాధాన్యమిస్తూ ట్రాన్సిట్ ఇన్సూరెన్స్‌ కల్పించాలని ఆలోచన చేస్తోందట.

Advertisement

ఈ డాలర్లను ఆకర్షణీయంగా ఉండేలా డిజైన్లలో మార్పులు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా బంగారం, వెండి ధరలు అమాంతంగా పెరిగాయి. చివరకు సామాన్యులు అటువైపు చూడలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వెండి డాలర్లకు బంగారం పూత పూసి విక్రయించాలని డిసైడ్ అయ్యింది.

కమిటీ సూచనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది టీటీడీ పాలకమండలి. త్వరలో తిరుమల శ్రీవారి బంగారు, వెండి డాలర్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. కొనుగోలు తర్వాత వారిచ్చిన అడ్రస్‌కు పంపనుంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×