TTD Ticket Release : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవ టికెట్లు ఈ నెల 18 న టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఉదయం 10 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కానుంది. అంతేకాకుండా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లు ఈ నెల 22 మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను, అదే రోజున ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. తిరుమలకు వచ్చే భక్తుల కోసం గదుల కోటాను ఏప్రిల్ 24న అందుబాటులో ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ టికెట్ల బుకింగ్ ప్రారంభం కానుంది.
ALSO READ: బిగ్ రిలీఫ్.. గాజుగ్లాసు జనసేనకే
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24 వ తేదీ ఉదయం 10 గంటలక టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా బుకింగ్ 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉండనుంది. శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టికెట్లను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు.