BigTV English
Advertisement

Vaikunta Ekadashi Tirumala Darshanam : వైకుంఠ ఏకాదశికి టికెట్లు ఉన్నవారికే స్వామి దర్శనం..

Vaikunta Ekadashi Tirumala Darshanam : వైకుంఠ ఏకాదశికి టికెట్లు ఉన్నవారికే స్వామి దర్శనం..

Vaikunta Ekadashi Tirumala Darshanam : వైకుంఠ ఏకాదశికి టికెట్లు కలిగి ఉన్న భక్తులనే తిరుమలకు అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. జనవరి 2న వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని.. 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలో ‘డయల్‌ యువర్ ఈవో’ వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై ఈవో ప్రకటించారు. వైకుంఠ ద్వార దర్శనాల వేళ రోజుకు 25వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లను జారీ చేస్తామన్నారు. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో రోజుకు 50 వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామన్నారు.


తిరుమల స్థానికులకు కౌస్తుభం వద్ద టోకెన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాట్టు తెలిపారు.. మొత్తంగా 7.5 లక్షల మందికి సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు.. 10 రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు.. శ్రీవారి ట్రస్టు దాతలకు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు జారీ చేస్తామన్నారు. మహాలఘు ద్వారానే అందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తామని ఈవో చెప్పారు. డిసెంబర్‌ 29 నుంచి జనవరి 3వ తేదీ వరకు తిరుమలలో అడ్వాన్స్‌ గదుల బుకింగ్‌ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. సీఆర్‌వో వద్దనే భక్తులకు గదులు కేటాయించేలా అన్ని ఏర్పాటు చేస్తాం అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.


Tags

Related News

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Big Stories

×