BigTV English

Vaikunta Ekadashi Tirumala Darshanam : వైకుంఠ ఏకాదశికి టికెట్లు ఉన్నవారికే స్వామి దర్శనం..

Vaikunta Ekadashi Tirumala Darshanam : వైకుంఠ ఏకాదశికి టికెట్లు ఉన్నవారికే స్వామి దర్శనం..

Vaikunta Ekadashi Tirumala Darshanam : వైకుంఠ ఏకాదశికి టికెట్లు కలిగి ఉన్న భక్తులనే తిరుమలకు అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. జనవరి 2న వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని.. 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలో ‘డయల్‌ యువర్ ఈవో’ వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై ఈవో ప్రకటించారు. వైకుంఠ ద్వార దర్శనాల వేళ రోజుకు 25వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లను జారీ చేస్తామన్నారు. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో రోజుకు 50 వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామన్నారు.


తిరుమల స్థానికులకు కౌస్తుభం వద్ద టోకెన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాట్టు తెలిపారు.. మొత్తంగా 7.5 లక్షల మందికి సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు.. 10 రోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు.. శ్రీవారి ట్రస్టు దాతలకు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు జారీ చేస్తామన్నారు. మహాలఘు ద్వారానే అందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తామని ఈవో చెప్పారు. డిసెంబర్‌ 29 నుంచి జనవరి 3వ తేదీ వరకు తిరుమలలో అడ్వాన్స్‌ గదుల బుకింగ్‌ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. సీఆర్‌వో వద్దనే భక్తులకు గదులు కేటాయించేలా అన్ని ఏర్పాటు చేస్తాం అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.


Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×