Vizianagaram district: సహజీవనం పచచని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా కుటుంబాలు ఛిన్నాభిన్నం కావడంతోపాటు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా సహజీవనం చేస్తున్న ప్రియుడిపై యాసిడ్ పోసి చింపిన ఘటన విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. అసలు ఏం జరిగింది?
విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో దారుణ హత్య జరిగింది. కందిపేటకు చెందిన రాములమ్మ దంపతులకు విభేదాలు వచ్చాయి. దీంతో భర్తకు దూరంగా ఉంటోంది. తన బావ కొడుకు శ్రీనుతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. అతడు కూడా ఫ్యామిలీ సమస్యలతో భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో రాములమ్మ-శ్రీను సహజీవనం మొదలుపెట్టారు. అంత క్లోజ్గా ఉన్న వీరి మధ్య ఏం జరిగిందో తెలీదు. గురువారం తెల్లవారుజామున వీరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.
అది కాస్త తారాస్థాయికి చేరింది. పట్టరాని కోపంతో రాములమ్మ ఇనుపరాడ్డుతో ప్రియుడు శ్రీను తలపై బలంగా కొట్టింది. ఇంట్లో ఉన్న యాసిడ్ తీసుకుని ప్రియుడిపై పోసింది. దీంతో అక్కడికక్కడే ప్రియుడు మృతి చెందాడు. ప్రియుడు మరణించడంతో షాకైన రాములమ్మ పురుగుల మందు తాగింది. ఇరుగుపొరుగువారు ఆమెని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాములమ్మ ఆరోగ్యం సీరియస్ గా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: జగన్ ప్రామిస్.. ఫుల్జోష్లో తమ్మినేని, స్టేట్ నుంచి కేంద్రానికి షిప్ట్!