Visakhapatnam: చాలామంది చేతిలో డబ్బులు ఉండగా ఖర్చు పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. రేపటికి పని కొస్తాయంటూ పొదుపు మంత్రం పాటిస్తుంటారు. ఒక్కోసారి వాటిని మరిచిపోతారు. ఫలితంగా ఆ డబ్బులు ఎందుకు పని చేయకుండా ఐపోతాయి. అలాంటి ఘటన విశాఖ సిటీ నడిబొడ్డున బయటపడింది. అసలు ఏం జరిగింది?
విశాఖపట్నం సిటీలోని సెంట్రల్ పార్క్ సమీపంలో కరెన్సీ నోట్ల కుప్ప తీవ్ర కలకలం రేపింది. పార్క్కు ఎదురుగా వున్న ఓ చోట పెద్ద సంఖ్యలో నోట్లు పడి ఉన్నాయి. మార్నింగ్ వాకర్స్ వాటిని గుర్తించారు. అందులో రూ.10 మొదలు రూ.500 వరకు నోట్లు ఉన్నాయి. నోట్లతోపాటు ఎల్ఐసీ రసీదులు, ఓ మహిళకు సంబంధించిన పాన్ కార్డు ఉన్నాయి. వెంటనే మార్నింగ్ వాకర్స్ దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, చిరిగిన లేదంటే ఎలుకలు కొట్టేసిన నోట్లను పరిశీలించారు.
ఆ నోట్లను ఎవరు ఇక్కడ పడేశారు? అన్నకోణంలో ఇరుగుపొరుగు వారిని ఆరా తీశారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. పాన్ కార్డు, ఇతర ఆధారాలతో ఆ నోట్ల సంబంధించిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు పూర్తయితే నోట్ల వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కరెన్సీ నోట్ల పక్కన ఎల్ఐసీ కట్టిన రసీదులు, ఓ మహిళ పాన్ కార్డు లభించడంతో ఏదైనా నేరానికి సంబంధించిన ఆధారాలను తొలగించేందుకు ఇక్కడ పడేశారా? ఆ నోట్ల పని చేయవని తెలిసి అక్కడ పారవేశారా? అనే కోణంలో స్థానికులు చర్చించుకున్నారు.
🚨 విశాఖలో కలకలం..
సెంట్రల్ పార్క్ ఎదుట కుప్పగా పడి ఉన్న కరెన్సీ నోట్లు! 💵
విశాఖపట్నంలో సెంట్రల్ పార్క్ ఎదురుగా రోడ్డుపై భారీగా చినిగిన కరెన్సీ నోట్లు కుప్పగా పడి ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇందులో రూ. 500, రూ. 100, రూ. 50, రూ. 20, రూ. 10 విలువైన చినిగిన నోట్లు ఉన్నాయి. pic.twitter.com/EM7SU2c9nW
— N Media News (@NMediaNewsOffl) September 16, 2026