Badvel Knife Attack: కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని భవనారాయణ నగర్ ఇదీ. ఇదే ఏరియాలో వెంకట మదన్, దినేష్ అనే అన్నదమ్ములు ఉన్నారు. తమ పని తాము చేసుకుంటూ ఉండేటోళ్లు. కానీ నెల రోజుల క్రితం ఒక స్కూటీ విషయంలో యశ్వంత్ అనే ఒక పోకిరీ గాడితో చిన్న గొడవ జరిగింది. పోనిలే అని ఆ సోదరులు ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు. కానీ ఈ యశ్వంత్ ఆ గొడవను అంత ఈజీగా తీసుకోలేదు. మనసులోనే పగ పెంచుకుని, ఆ అన్నదమ్ములను ఎలాగైనా అటాక్ చేయాలని లోపల బిగ్ స్కెచ్ వేస్తూ వచ్చాడు.
రాజీ పడదామని పిలిచి కత్తితో..
పాత గొడవలు ఎందుకురా.. కూర్చుని సెటిల్ చేసుకుందాం అంటూ మాటలతో నమ్మించాడు. గుంతపల్లి క్రాస్ రోడ్డుకి ఆ అన్నదమ్ములను పిలిపించాడు ఆ రాస్కెల్. నమ్మి అక్కడికి వచ్చిన ఆ అమాయకులతో కాసేపు మాట్లాడినట్లు డ్రామా ఆడాడు. సడన్గా మాటామాటా పెరగడంతో.. ముందుగానే ప్లాన్ ప్రకారం దాచుకున్న పదునైన కత్తి బయటికి తీసి ఇద్దరిని పొడిచేశాడు.
కత్తితో కసి తీర్చుకున్న సైకో!
రక్తంతో నిండిన అన్నదమ్ముల ఆర్తనాదాలు విని స్థానికులు పరిగెత్తుకు రావడంతో.. ఈ సైకో యశ్వంత్ గాడు అక్కడి నుంచి జంప్ అయ్యాడు. తీవ్రగాయాలతో పడి ఉన్న వెంకట మదన్, దినేష్ను హుటాహుటిన బద్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి సీరియస్గా ఉండటంతో కడప RIMS కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ కసాయి యశ్వంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Also Read:కేసీఆర్, రేవంత్ రెడ్డికి డీఎన్ఏ టెస్ట్ చేయాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!