Rajam Tragedy: విజయనగరం జిల్లా రాజాంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన యావత్ సమాజాన్ని ఆలోచింపచేసేలే చేసింది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా రాజాంలో భర్త అంత్యక్రియలకు డబ్బులు లేక ఐదు గంటలుగా మృతదేహం వద్దే భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో వారికి సహయం చేయాల్సిన బంధువులు సైతం ముఖం చాటసిన పరిస్థితి నెలకొంది.
రాజాం కుమ్మర వీధికి చెందిన వెంకట్రావు అనారోగ్యంతో మృతి చెందారు. వారికి పిల్లలు లేకపోవడంతో భార్య పుణ్యవతి ఒంటరిగా మిగిలిపోయారు. దీంతో అంత్యక్రియలకు డబ్బులు లేక మృతదేహం వద్దే కన్నీరు పెట్టుకుందా మహిళ. కనీసం సహయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రాక పోవడంతో ఈ సంఘటన కలకలం రేపింది. ఓ పక్క చనిపోయిన భర్త మరో పక్క పట్టించుకోని భందువులు ఇలా విగత జీవిగా ఆ మృదేహంతో మహిళ పడి ఉంది.
Also read: పదేళ్ల తర్వాత మళ్లీ కలిసే పాత ప్రేమికులు.. కట్ చేస్తే ఊహించని స్కాండల్లో భర్త అడ్డంగా బుక్
అయితే ఈ విషయం తెలుసుకున్న రాజాం సీఐ నవీన్కుమార్ వెంటనే స్పందించి సాటి మహిళకు ఆర్థిక సాయం అందించారు. దీంతో బంధువులు దూరమైన వేళ పోలీసు అధికారి మానవత్వంతో అండగా నిలబడి ఆదుకున్నారు. పోలీస్ అధికారి చేసిన సహయంతో భార్య తమ కార్యక్రమాలు చేసింది. పోలీస్ చేసిన సహయానికి అక్కడి స్థానికులు అభినందనలు తెలిపారు. సాటి సమాజానికి ఇదో ఆలోచింపచేసే దారుణ సంఘటనగా కొనియాడారు.
Also read: ఈశ్వర్ సాయి మాధురి వివాదం.. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఈశ్వర్ సాయి వైఫ్ శరణ్య!