E-Paper
Advertisement

YS Sharmila : వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం..

YS Sharmila : వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం..
Advertisement
AP Political News

YS Sharmila latest news(AP political news):

ఏపీ పగ్గాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. ఏపీసీసీ అధ్యక్షరాలిగా ఆమెను నియమించింది. ఇటీవల షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు కీలక పదవి ఇస్తారని స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఏపీ బాధ్యతలు షర్మిలకు అప్పగించింది.

తాజాగానే ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తారనే అధిష్టానం సమాచారం రాగానే ఆయన పీసీసీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం కల్పించారు.

AICC Press Release
Advertisement

తనను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడంపై షర్మిల స్పందించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలకు ధన్యవాదాలు తెలిపారు. శక్తివంచన లేకుండా నిస్వార్ధంగా పార్టీ కోసం పని చేస్తానని షర్మిల ట్వీట్ చేశారు.

Related News

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×