BigTV English
Advertisement

YS Sharmila : వైఎస్ కుటుంబం చీలడానికి జగనే కారణం.. దేవుడు, విజయమ్మే సాక్ష్యం..

YS Sharmila : వైఎస్ కుటుంబం చీలడానికి జగనే కారణం.. దేవుడు, విజయమ్మే సాక్ష్యం..

YS Sharmila : ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచనల వ్యాఖ్యలు చేశారు. బుధవారం తిరుపతిలో తన అన్న జగన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్‌ కుటుంబం చీలడానికి జగన్‌ కారణమని స్పష్టం చేశారు. జగనన్న వల్లే అనేందుకు సాక్ష్యం దేవుడు.. తన తల్లి విజయమ్మ అని పేర్కొన్నారు. కాకినాడలో కాంగ్రెస్‌ పార్టీ నేతలతో సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీని, తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ చీల్చిందని జగన్‌ వ్యాఖ్యనించిన తర్వాత రోజు షర్మిల కౌంటర్ ఇచ్చి సంచలనం రేపారు.


ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ బలం పుంజుకుంటోందని వైఎస్‌ షర్మిల అన్నారు. పోలవరం.. వైఎస్‌ఆర్‌ కలల ప్రాజెక్టు అని చెప్పారు. వైఎస్‌ఆర్‌ సీఎం అయిన 6 నెలల్లోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తన తండ్రి ఆశయాలను జగన్ నెరవేరుస్తారు అని అనుకున్నానని పేర్కొన్నారు. కానీ నెరవేర్చలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణం సీఎం జగనే అని మండిపడ్డారు.

వైసీపీ అధికారంలోకి రావడానికి తానెంతో కృషి చేశానని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు. వైసీపీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారని జగన్ పై ఘాటు విమర్శలు చేశారు.


.

.

Related News

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

Big Stories

×