E-Paper
Advertisement

YSRCP : అధికారమే అండగా.. రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు..

YSRCP : పల్నాడు జిల్లా క్రోసూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కుమారుడు కల్యాణ్ ఆధ్వర్యంలో ఈ భీభత్సం జరిగింది. వైసీపీ పార్టీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని కంచేటి సాయి కోసం గాలించారు. ఈ క్రమంలో సాయి అనుచరుడు కె.రాము కన్సల్టెన్సీ ఆఫీసుపై దాడి చేశారు. ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. వైసీపీ శ్రేణుల తీరుతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారమే అండగా ఎమ్మెల్యే అనుచరులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ తతంగాన్ని పట్టించుకోకుండా క్రోసూరు పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారనే ఆరోపనలు ఉన్నాయి.

YSRCP : అధికారమే అండగా.. రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు..
Advertisement

YSRCP : పల్నాడు జిల్లా క్రోసూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కుమారుడు కల్యాణ్ ఆధ్వర్యంలో ఈ భీభత్సం జరిగింది. వైసీపీ పార్టీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని కంచేటి సాయి కోసం గాలించారు. ఈ క్రమంలో సాయి అనుచరుడు కె.రాము కన్సల్టెన్సీ ఆఫీసుపై దాడి చేశారు. ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. వైసీపీ శ్రేణుల తీరుతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారమే అండగా ఎమ్మెల్యే అనుచరులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ తతంగాన్ని పట్టించుకోకుండా క్రోసూరు పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారనే ఆరోపనలు ఉన్నాయి.

క్రోసూరు లో ఏం జరిగిందంటే..? వైసీపీ బహిష్కృత నేత సాయి.. పెదకూరపాడు ఎమ్మెల్యే అవినీతిపై నియోజకవర్గ ప్రజలకు వివరించేందుకు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి వస్తున్న సాయిని బెల్లంకొండ వద్ద వాహనాలు అడ్డుపెట్టి పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

క్రోసూరులో మీడియా సమావేశం పెట్టొద్దని ఆంక్షలు విధించారు. అనంతరం కంచేటి సాయి మీడియాతో మాట్లాడుతూ… పెదకూరపాడులో వైసీపీ అవినీతిపై చర్చించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు మీడియా సమావేశాలు పెట్టకుండా పోలీసుల సాయంతో అధికార పార్టీ అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు. సాయి క్రోసూరు వచ్చారని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు బీభత్సం సృష్టించారు.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×