BigTV English
Advertisement

Yuvagalam: యువగళం పాదయాత్ర సక్సెస్.. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు..

Yuvagalam:  యువగళం పాదయాత్ర సక్సెస్.. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు..

Yuvagalam: ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగిసింది. రాష్ట్రం మొత్తంగా 226 రోజుల పాటు యువగళం పాదయాత్ర సాగింది. 3132 కిలో మీటర్లు మేర పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను తిరుగుతూ ప్రజలను, కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు.


జగన్ ప్రభుత్వం ప్రజలపై మోపిన భారాలను వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. దీంతొ యువగళం పాదయాత్రకు భారీగా స్పందన వచ్చింది . సోమవారం గాజువాకలోని అగనంపూడి టోల్ గేట్ వద్ద మినీ పైలాన్ ఏర్పాటు చేసి పాదయాత్రను ముగించారు. అయితే చంద్రబాబు పాదయాత్ర ముగించిన చోటే యువగళం పాదయాత్ర కూడా ముగించడం మరో విశేషం.

యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రారంభమైంది. 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్లు నడిచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుందని లోకేశ్‌ సమరశంఖం పూరించారు. కానీ గాజువాకలో పాదయాత్రకు ముగింపు పలికారు.


మరోవైపు డిసెంబర్‌ 20న విజయనగరం జిల్లాలోని భోగాపురంలో పాదయాత్ర ముగింపు సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి యువకులు, ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు మద్దతు పలికారు. విశాఖపట్టణం జిల్లాలోని భోగాపురంలో జరిగే యువగళం బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి టీడీపీ కార్యకర్తలు, మద్దతు దారులు ఈ రోజే ప్రత్యేక రైల్లో బయలు దేరారు.

Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×