E-Paper
Advertisement

Yuvagalam: యువగళం పాదయాత్ర సక్సెస్.. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు..

Yuvagalam:  యువగళం పాదయాత్ర సక్సెస్.. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు..

Yuvagalam: ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగిసింది. రాష్ట్రం మొత్తంగా 226 రోజుల పాటు యువగళం పాదయాత్ర సాగింది. 3132 కిలో మీటర్లు మేర పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను తిరుగుతూ ప్రజలను, కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు.

జగన్ ప్రభుత్వం ప్రజలపై మోపిన భారాలను వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. దీంతొ యువగళం పాదయాత్రకు భారీగా స్పందన వచ్చింది . సోమవారం గాజువాకలోని అగనంపూడి టోల్ గేట్ వద్ద మినీ పైలాన్ ఏర్పాటు చేసి పాదయాత్రను ముగించారు. అయితే చంద్రబాబు పాదయాత్ర ముగించిన చోటే యువగళం పాదయాత్ర కూడా ముగించడం మరో విశేషం.

యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రారంభమైంది. 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్లు నడిచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుందని లోకేశ్‌ సమరశంఖం పూరించారు. కానీ గాజువాకలో పాదయాత్రకు ముగింపు పలికారు.

మరోవైపు డిసెంబర్‌ 20న విజయనగరం జిల్లాలోని భోగాపురంలో పాదయాత్ర ముగింపు సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి యువకులు, ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు మద్దతు పలికారు. విశాఖపట్టణం జిల్లాలోని భోగాపురంలో జరిగే యువగళం బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి టీడీపీ కార్యకర్తలు, మద్దతు దారులు ఈ రోజే ప్రత్యేక రైల్లో బయలు దేరారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×