E-Paper
Advertisement

HDFC Shares Crash: ఒక్క రాజీనామాతో రూ.1 లక్ష కోట్లు ఆవిరి.. HDFCలో ఏం జరుగుతోంది?

HDFC Shares Crash: ఒక్క రాజీనామాతో రూ.1 లక్ష కోట్లు ఆవిరి.. HDFCలో ఏం జరుగుతోంది?

HDFC Shares Crash: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులో ఒక్క రాజీనామా గంటల వ్యవధిలో పెట్టుబడిదారుల సంపదలో రూ. 1 లక్ష కోట్లకు ఆవిరైపోయింది. పైగా మార్కెట్ పతనానికి దారితీసింది. తన వ్యక్తిగత విలువలను విరుద్ధంగా పనిచేయలేనని హెచ్డీఎఫ్ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి చక్రవర్తి బుధవారం రాత్రి రాజీనామా చేశారు. దీంతో గురువారం హెచ్డీఎఫ్సీ షేర్ వ్యాల్యూ దాదాపు 9% పతనమైంది.

9 శాతం నష్టం

తాను బ్యాంకులో జరిగిన ఎలాంటి తప్పులనూ ఎత్తి చూపడం లేదని, నా సిద్ధాంతాలు ఆ సంస్థతో సరిపోలలేదని చక్రవర్తి మీడియాతో అన్నారు. బుధవారం రాత్రి హెచ్డీఎఫ్సీ బ్యాంకు చక్రవర్తి రాజీనామాను వెల్లడించింది. తన లేఖలో, గత రెండేళ్లుగా బ్యాంకులో జరిగిన కొన్ని పరిణామాలు తన వ్యక్తిగత విలువలకు అనుగుణంగా లేవని చక్రవర్తి రాశారు. తన రాజీనామాకు ఎలాంటి ముఖ్యమైన కారణాలను ఆయన చెప్పలేదు. ఛైర్మన్ రాజీనామాతో మార్కెట్లు వేగంగా రియాక్ట్ అయ్యాయి. హెచ్డీఎఫ్సీ షేర్లు 8.66% తగ్గి 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. తాజాగా హెచ్డీఎఫ్సీ షేర్ రూ. 770 వద్ద ఉంది. యూఎస్ లిస్టెడ్ ఏడీఆర్‌లు రాత్రికి రాత్రే 7% పైగా పతనం అయ్యాయి. ఈ ఏడాది హెచ్డీఎఫ్సీ స్టాక్ 15% పతనాన్ని చూసింది.

తాత్కాలిక ఛైర్మన్ గా

HDFC మాజీ సీఈవో కేకీ మిస్త్రీ.. ఆర్బీఐ ఆమోదంతో 3 నెలల కాలానికి తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. బ్యాంకులో అంతర్గత విభేదాలు లేవని ఆయన తెలిపారు. చక్రవర్తి, బోర్డుకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మిస్త్రీ అన్నారు. ఆయన తన లేఖలో పేర్కొ్న్న నైతిక విలువల కారణాలపై డైరెక్టర్లకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని మిస్త్రీ తెలిపారు. డిప్యూటీ ఎండీ కైజాద్ భరూచాకు అదనపు బాధ్యతలు కేటాయించారు.

Also Read:  జియో పేమెంట్స్ బ్యాంక్ మరో అడుగు.. ఏటీఎం లేకుండా డబ్బులు తీసుకోవచ్చు, అదెలా?

మదుపర్ల సెంటిమెంట్

చక్రవర్తి రాజీనామా వెనుక స్పష్టమైన కారణాలు తెలియకపోయినా.. మదుపర్లు వెనకడుగు వేశారు. హెచ్డీఎఫ్సీ రాబడి బలంగా ఉన్నప్పటికీ, ఈ విషయంపై బోర్డు స్పష్టత ఇచ్చే వరకు పెట్టుబడిదారులపై ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. సీఈఓ శశిధర్ జగదీషన్ నియామకంపై కూడా అనిశ్చితి కొనసాగుతుండడంతో.. హెచ్డీఎఫ్సీ స్టాక్‌ ఒడిదుడుకులకు లోనవుతుందని నిపుణులు అంటున్నారు.

Related News

గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇకపై ఆ కోడ్ లేకపోతే సిలిండర్ రానట్లే!

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

Big Stories

×