Jio Payments Bank: భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను బలోపేతం చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది జియో పేమెంట్స్ బ్యాంక్. తాజాగా దీని ద్వారా వినియోగదారులకు కొత్త సేవను ప్రారంభించింది. ఏటీఎం కార్డులతో ఎలాంటి సంబంధం లేకుండా యూపీఐ ద్వారా నేరుగా డబ్బులు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తన బిజినెస్ కరస్పాండెంట్ నెట్వర్క్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.
జియో పేమెంట్స్ బ్యాంక్ మరో అడుగు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ దూసుకుపోతోంది. దేశంలో కీలకమైన కొత్త డిజిటల్ సర్వీసు ప్రారంభించింది. వినియోగదారులు ఏటీఎం కార్డుతో సంబంధం లేకుండా యూపీఐ ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని తెచ్చింది. తన బిజినెస్ కరస్పాండెంట్ నెట్వర్క్ ద్వారా ఈ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆ తరహా సేవను వినియోగించుకునేవారు సమీపంలోని జియో బిజినెస్ కరస్పాండెంట్ వద్దకు వెళ్లాలి. వారి వద్ద యూపీఐ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన తర్వాత యూపీఐ యాప్ ద్వారా లావాదేవీని ఆమోదించాలి. కస్టమర్లకు కావాల్సిన నగదును కరస్పాండెంట్ అందజేస్తారు. దీనికి ఎలాంటి ఏటీఎం కార్డు అవసరం లేదు.
ఏటీఎం లేకుండా డబ్బులు తీసుకోవచ్చు
ఆ తరహా పద్దతిని గ్రామీణ ప్రాంతాలు, మేజర్ పంచాయితీల్లో కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ సర్వీసు ప్రవేశపెట్టింది ఆ సంస్థ. డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడుతున్నవారు, కార్డు లేకుండా డబ్బులు అందుబాటులోకి తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ విషయాన్ని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్-జేఎఫ్ఎస్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
దీనివల్ల డిజిటల్ చెల్లింపులు-భౌతిక నగదుకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఆ సంస్థ భావిస్తోంది. 2016 నవంబర్లో జియో పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వ్యక్తులు, వ్యాపారాలకు అనుగుణంగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్న విషయం తెల్సిందే.
ALSO READ: పండుగ వేళ పసిడి ఘాటు.. ఉగాది పచ్చడిలో తీపి కంటే బంగారం ధర చేదే ఎక్కువ!