INDIA EU Trade Deal: భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం సులభం కానుంది. వాణిజ్య ఒప్పందంతో యూరోపియన్ ఎగుమతుల్లో దాదాపు 97 శాతం వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోమొబైల్స్ రంగాలలోని అనేక ఉత్పత్తులు భవిష్యత్తులో చౌకగా లభించే అవకాశం ఉంది. ఎఫ్టీఏతో యూరోపియన్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తారు. దీంతో ఏడాది 4 బిలియన్ల యూరోల వరకు పన్నులు తగ్గనున్నాయి.
యూరోపియన్ దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకునే… చాక్లెట్లు, వైన్లు, కార్లు సహా చాలా వాటిపై 150 శాతం నుంచి 50 శాతానికి, 20 శాతం నుంచి సున్నా శాతానికి సుంకాలు తగ్గనున్నాయి.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక సవాళ్లు పెరుగుతున్న సమయంలో ఈ ఒప్పందం ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ సంబంధాలను బలోపేతం చేస్తుందని ఈయూ తెలిపింది. ఈ ఒప్పందం సుంకాలు, పరిపాలనా భారాలు తగ్గనున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం మరింత సులభతరం కానుంది. ఈయూలోని 27 సభ్య దేశాలతో చౌకగా ఇండియా వ్యాణిజ్యం మెరుగుపడుతుంది.
వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య వాణజ్య భాగస్వామ్యానికి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 1/3 వంతు ప్రాతినిధ్యం వహించనుంది.
Also Read: అమెరికాకు మాస్టర్ స్ట్రోక్.. భారత్-ఈయూ చేతులు కలిపాయి.. ప్రపంచ వాణిజ్యంలో కొత్త శకం