Indirect Tax Collection: 2025-26 ఆర్థిక సంవత్సరానికి పరోక్ష పన్ను వసూళ్లు లక్ష్యానికి మించాయని గురువారం అధికారులు ప్రకటించారు. సవరించిన అంచనాల ప్రకారం.. కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీతో సహా మొత్తం పరోక్ష పన్ను వసూళ్లు రూ. 15.52 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపింది. ఇందులో కస్టమ్స్ డ్యూటీ నుంచి రూ. 2.58 లక్షల కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 3.38 లక్షల కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ. 9.58 లక్షల కోట్లు వసూళ్లు అయ్యాయి. కస్టమ్స్ డ్యూటీ రాబడి 102 శాతంగా ఉందని, ఎక్సైజ్ డ్యూటీ 101 శాతంగా ఉందని పేర్కొన్నారు.
ఆర్థిక సంవత్సరం 2025-26 హెల్త్, జాతీయ భద్రతా సెస్ వసూళ్ల ద్వారా రూ. 2,330 కోట్లు వసూలు అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. అయితే, వాస్తవ వసూళ్లు 63 శాతానికి తగ్గాయి. హెల్త్, జాతీయ భద్రతా సెస్ చట్టం ప్రకారం, 2026 ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా యూనిట్లపై సెస్ విధించారు. ఈ సెస్ అత్యధిక 40 శాతం జీఎస్టీ రేటుకు అదనంగా వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెస్ వసూళ్లు మరింత మెరుగుపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సెస్ ద్వారా రూ. 14,000 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: మొండి బకాయిలపై అధికారుల కొరడా.. సీజ్ అవుతున్న భారీ మాల్స్, హోటళ్లు!