E-Paper
Advertisement

అంచనాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లంటే?

అంచనాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లంటే?
Advertisement

Indirect Tax Collection: 2025-26 ఆర్థిక సంవత్సరానికి పరోక్ష పన్ను వసూళ్లు లక్ష్యానికి మించాయని గురువారం అధికారులు ప్రకటించారు. సవరించిన అంచనాల ప్రకారం.. కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీతో సహా మొత్తం పరోక్ష పన్ను వసూళ్లు రూ. 15.52 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపింది. ఇందులో కస్టమ్స్ డ్యూటీ నుంచి రూ. 2.58 లక్షల కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 3.38 లక్షల కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ. 9.58 లక్షల కోట్లు వసూళ్లు అయ్యాయి. కస్టమ్స్ డ్యూటీ రాబడి 102 శాతంగా ఉందని, ఎక్సైజ్ డ్యూటీ 101 శాతంగా ఉందని పేర్కొన్నారు.

పాన్ మసాలా సెస్ రూ.14 వేల కోట్లు

ఆర్థిక సంవత్సరం 2025-26 హెల్త్, జాతీయ భద్రతా సెస్ వసూళ్ల ద్వారా రూ. 2,330 కోట్లు వసూలు అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. అయితే, వాస్తవ వసూళ్లు 63 శాతానికి తగ్గాయి. హెల్త్, జాతీయ భద్రతా సెస్ చట్టం ప్రకారం, 2026 ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా యూనిట్లపై సెస్ విధించారు. ఈ సెస్ అత్యధిక 40 శాతం జీఎస్టీ రేటుకు అదనంగా వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెస్ వసూళ్లు మరింత మెరుగుపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సెస్ ద్వారా రూ. 14,000 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Also Read:  మొండి బకాయిలపై అధికారుల కొరడా.. సీజ్ అవుతున్న భారీ మాల్స్, హోటళ్లు!

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×