E-Paper
Advertisement

Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కేంద్రం కీల‌క‌ ప్రకటన

Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కేంద్రం కీల‌క‌ ప్రకటన
Advertisement

Hyderabad Metro Phase 2: హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కీలక ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్రాజెక్టు ఆమోదానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట కాలపరిమితి లేదని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మెట్రో ప్రాజెక్టులు భారీ వ్యయంతో కూడుకున్నవని దీని ఆమోదం అనేది అనేక సాంకేతిక, ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టిన మెట్రో రైల్ పాలసీకి అనుగుణంగా ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలపై అప్రైజల్ (మదింపు) జరుగుతోందని మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు నిధుల లభ్యత, వనరుల సమీకరణ ఆధారంగానే తుది నిర్ణయం ఉంటుందని వివరించారు. ముఖ్యంగా ప్రతిపాదిత రెండో దశ నెట్‌వర్క్‌ను ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొదటి దశ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసే విషయంలో సాంకేతిక సవాళ్లు ఉన్నాయని సభ దృష్టికి తెచ్చారు. ఈ సాంకేతిక సాధ్యసాధ్యాలపై లోతైన అధ్యయనం చేసి సలహాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నామినేట్ చేసినట్లు తెలిపారు.

Advertisement

హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు రకాల ఆప్షన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ ఆప్షన్లను క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సమాధానం, కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రాజెక్టు తదుపరి అడుగులు పడనున్నాయి. మెట్రో రెండో దశ ద్వారా నగరంలోని శివారు ప్రాంతాలకు అనుసంధానత పెరుగుతుందని విమానాశ్రయ మార్గం సహా ఐటీ కారిడార్లలో రద్దీ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే భారీ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం (PPP మోడల్) లేదా ఇతర ఆర్థిక వనరుల గురించి కూడా కేంద్రం ప్రస్తావించింది. ప్రస్తుతానికి ప్రతిపాదనలు ప్రాథమిక పరిశీలన దశలోనే ఉన్నాయని సాంకేతిక నివేదికలు అందిన తర్వాతే ఆర్థిక కేటాయింపులపై స్పష్టత వస్తుందని మంత్రి తోకన్ సాహూ వివరించారు. మెట్రో రెండో దశ కోసం వేచి చూస్తున్న నగరవాసులకు కేంద్రం ఇచ్చిన ఈ సమాధానంతో ప్రాజెక్టు ప్రస్తుత స్థితిపై ఒక స్పష్టత లభించింది.

Advertisement

Read Also: నేతన్నల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్.. కల్వకుంట్ల కవిత విమర్శలు!

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×