E-Paper
Advertisement

Saudi Aramco Refinery Attack: అరామ్‌కోపై ఇరాన్ దాడి.. భారత్ కు పెద్ద దెబ్బ.. ఆకాశానికి ముడి చమురు ధరలు!

Saudi Aramco Refinery Attack: అరామ్‌కోపై ఇరాన్ దాడి.. భారత్ కు పెద్ద దెబ్బ.. ఆకాశానికి ముడి చమురు ధరలు!

Saudi Aramco Refinery Attack: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇరాన్ తన వ్యూహాన్ని మార్చి గల్ఫ్ దేశాలలోని కీలక చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియాలోని ప్రపంచ ప్రఖ్యాత అరామ్‌కో (Aramco) ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ శనివారం షాహెద్-136 (Shahed-136) ఆత్మహుతి డ్రోన్లతో విరుచుకుపడింది. చమురు ఎగుమతులకు గుండెకాయ వంటి ఈ రిఫైనరీపై దాడి జరగడంతో అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు పెను ఆటంకం ఏర్పడింది. కేవలం సౌదీ అరేబియానే కాకుండా కువైట్, యూఏఈ, బహ్రెయిన్ దేశాల పైనా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది.

సౌదీ అరామ్‌కోకు చెందిన రాస్ తనూరా రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి, ఎగుమతి కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రతిరోజూ సుమారు 5.5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేస్తారు. అంతేకాకుండా దాదాపు 3.3 కోట్ల బ్యారెళ్ల చమురును నిల్వ చేసే భారీ వసతులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక లోడింగ్ బెర్తులు, విస్తృతమైన పైప్‌లైన్ నెట్‌వర్క్‌తో కూడిన ఈ పోర్ట్ ద్వారా ప్రపంచ చమురు డిమాండ్‌లో దాదాపు 7 శాతం ఎగుమతులు జరుగుతాయి. ఇంతటి కీలకమైన కేంద్రంపై దాడి జరగడం వల్ల గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది.

ప్రస్తుతానికి అరామ్‌కో రిఫైనరీ వద్ద మంటలను అదుపు చేసేందుకు సౌదీ దళాలు ప్రయత్నిస్తున్నాయి. చమురు సరఫరాను పునరుద్ధరించడానికి ఎంత సమయం పడుతుందనే అంశంపై స్పష్టత లేదు. ఇరాన్ వరుసగా గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలపై దాడులు చేస్తుండటంతో అమెరికా, ఇజ్రాయెల్ తమ తదుపరి చర్యలను మరింత కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనకపోతే ఈ ఇంధన సెగ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సామాన్యుడి జేబుపై ప్రభావం చూపనుంది.

ఈ దాడి ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపై తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. రిఫైనరీ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల చమురు ధరలు రికార్డు స్థాయికి పెరిగే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకవచ్చు. ఇప్పటికే యుద్ధం కారణంగా విమానయాన రంగం ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు ఇంధన సంక్షోభం కూడా తోడవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also: Filipino women: ఇరాన్ దాడులు.. లైవ్‌లో ఎగిరిపడిన మహిళ! ఇదిగో వీడియో

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×