E-Paper
Advertisement

Low Cost Plans: జియో, ఎయిర్ టెల్, విఐ.. సరికొత్త సిమ్ యాక్టివ్ ప్లాన్స్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే..

Low Cost Plans: జియో, ఎయిర్ టెల్, విఐ.. సరికొత్త సిమ్ యాక్టివ్ ప్లాన్స్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే..

Low Cost Plans: ఇంటర్నెట్ డేటాతో పనిలేకుండా మెుబైల్ నెంబర్లను యాక్టివ్ ఉంచే ప్లాన్ లను విడుదల చేయాలని టెలికాం సంస్థలను TRAI ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్, జియో, విఐ.. బడ్జెట్ లో సరికొత్త సిమ్ యాక్టివ్ ప్లాన్స్ ను తీసుకొచ్చాయి. ఒకసారి రీఛార్జ్ చేయడం ద్వారా నిర్దేశిత కాలం వరకూ డేటా లేకపోయినా.. ఫోన్ కాల్స్, ఎస్ఎంస్ లు చేసుకోవచ్చు.

రిలయన్స్ జియో

రూ.469 రీఛార్జ్ ప్లాన్: జియో తన ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం రూ.469 నయా రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 84 రోజుల పాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. అలాగే 900 ఫ్రీ ఎస్ఎంఎస్ లను సొంతం చేసుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ లో రోమింగ్ కాల్స్ సైతం ఫ్రీగా పొందవచ్చు.

రూ.1,748 ప్లాన్: దాదాపు ఏడాది వరకూ అన్ లిమిటెడ్ కాల్స్ కోరుకునే వారు ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు. 336 రోజుల అపరిమిత కాల్స్ కు ఈ ప్లాన్ అవకాశం కల్పిస్తుంది. అదే విధంగా 3600 ఫ్రీ ఎస్ఎంస్ లు పొందవచ్చు.

రూ. 103 ప్లాన్: సిమ్ యాక్టివ్ ప్లాన్స్ కు సంబంధించి గతంలోనే ఈ చౌకైనా ప్లాన్ ను జియో తీసుకొచ్చింది. దీని ద్వారా 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. అలాగే 5GB డేటా కూడా రానుంది.

భారతీ ఎయిర్ టెల్

రూ.469 ప్లాన్: భారతీ ఎయిర్ టెల్ కొత్తగా ఈ ప్లాన్ లాంచ్ చేసింది. దీని కింద 84 రోజుల పాటు అపరిమిత కాల్స్, 900 ఉచిత ఎస్ఎంస్ లు పొందవచ్చు.

రూ.1849 ప్లాన్: సంవత్సర కాలం పాటు ఉండే సిమ్ యాక్టివ్ ప్లాన్ కావాలనుకుంటే దీనిని పరిశీలించవచ్చు. 365 ఫ్రీ కాల్స్, 3600 ఎస్ఎంస్ లు, ఫ్రీ రోమింగ్ కాల్స్ పొందవచ్చు.

Also Read: Air Coolers Launch Mar 2026: ఏసీలు ఎందుకు దండగా.. ఈ కూలర్లు ఉండగా.. మార్చిలో క్రేజీ కూలర్లు లాంచ్!

వొడాఫోన్ ఇండియా

రూ.470 ప్లాన్: వొడాఫోన్ ఇండియా సైతం జియో, ఎయిర్ టెల్ తరహాలోనే కొత్తగా సిమ్ యాక్టివ్ ప్లాన్స్ ను విడుదల చేసింది. రూ.470 రీఛార్చ్ చేసుకుంటే 84 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్, ఉచిత ఎస్ఎంస్ లు పొందవచ్చు.

రూ.1849 ప్లాన్: ఏడాది పొడవునా రీఛార్జ్ ప్లాన్ కావాలనుకుంటే ఈ ప్లాన్ ట్రై చేయండి. దీని ద్వారా 365 రోజుల పాటు అపరిమిత కాల్స్, ఎస్ఎస్ఎస్ లు సొంతం చేసుకోవచ్చు.

Also Read: Hyderabad Crime: రూ.56 లక్షల ఏటీఎం డబ్బుతో జంప్.. ఎట్టకేలకు చిక్కిన వ్యాన్ డ్రైవర్

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×