E-Paper
Advertisement

కార్పొరేట్ రూల్స్ vs హిందూ ధర్మం.. ముంబై లెన్స్‌కార్ట్ స్టోర్‌లో అసలేం జరిగింది?

కార్పొరేట్ రూల్స్ vs హిందూ ధర్మం..  ముంబై లెన్స్‌కార్ట్ స్టోర్‌లో అసలేం జరిగింది?

Lenskart Controversy: ముంబైలోని లెన్స్‌కార్ట్ (Lenskart) స్టోర్‌లో బీజేపీ నేత నాజియా ఇలాహీ ఖాన్ సిబ్బందిని నిలదీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చకు దారితీసింది. స్టోర్ ఉద్యోగులకు ఆమె స్వయంగా తిలకం దిద్ది, వారితో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయించడం ఆ వీడియోలో కనిపించింది. హిందూ సంప్రదాయ చిహ్నాలైన తిలకం, మంగళసూత్రం, బొట్టు వంటి వాటిపై లెన్స్‌కార్ట్ నిషేధం విధించిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఈ నిరసన చేపట్టారు. పని ప్రదేశాల్లో సాంస్కృతిక, మతపరమైన హక్కులను గౌరవించాలంటూ ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ వివాదం ముదిరిన తరుణంలో లెన్స్‌కార్ట్ సీఈఓ పీయూష్ బన్సల్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. సంస్థ పాత స్టైల్ గైడ్ లో ఉన్న నిబంధనలు ప్రస్తుత విధానాలను ఉద్దేశించిన‌వి కావ‌ని ఆయన స్పష్టం చేశారు. ఆ పాత నిబంధనల ప్రకారం మతపరమైన చిహ్నాలపై ఉన్న పరిమితులను తొలగించామ‌న్నారు. ప్రస్తుతం బొట్టు, తిలకం, కలావా, హిజాబ్ వంటి అన్ని రకాల మతపరమైన వ్యక్తీకరణలను లెన్స్‌కార్ట్ అనుమతిస్తోందని ఆయన వివరణ ఇచ్చారు. అయితే, సీఈఓ వివరణ ఇచ్చిన తర్వాత కూడా నాజియా ఇలాహీ ఖాన్ వీడియో బయటకు రావడం, కార్పొరేట్ నిబంధనలు వర్సెస్ సాంస్కృతిక హక్కుల మధ్య ఉన్న వివాదాన్ని మరోసారి చర్చకు పెట్టింది.

ఈ వివాదానికి ప్రధాన కారణం లెన్స్‌కార్ట్ సంస్థ ఇంట‌ర్న‌ల్ గ్రోమింగ్ పాలసీ. గతంలో రూపొందించిన ఈ పాలసీలో ఉద్యోగులు విధుల్లో ఉన్నప్పుడు తలపై తిలకం, మణికట్టుకు కలావా (మతపరమైన దారం), లేదా పెద్ద బొట్టు వంటివి ధరించకూడదని నిబంధనలు ఉన్నాయి. ఉద్యోగులందరూ ఒకేవిధంగా, ప్రొఫెషనల్‌గా కనిపించాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలు పెట్టారు. అయితే, అవి భారతీయ సంస్కృతిని, మత స్వేచ్ఛను హరిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఒక ఉద్యోగికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడం, అందులో మతపరమైన చిహ్నాలపై ఆంక్షలు ఉండటంతో ఈ వివాదం రాజుకుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం కార్పొరేట్ సంస్థలు తమ ప్రొఫెషనల్ ఇమేజ్ కోసం ఇలాంటి నిబంధనలు పెట్టుకోవడంలో తప్పులేదని వాదిస్తుంటే, మెజారిటీ ప్రజలు మాత్రం ఒక వ్యక్తి తన మతపరమైన ఆచారాలను పాటించే హక్కును పని ప్రదేశాలు కాలరాయకూడదని అభిప్రాయపడుతున్నారు. లెన్స్‌కార్ట్ తన విధానాలను వెంటనే సవరించినప్పటికీ, ఈ ఘటన దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కార్పొరేట్ సంస్థలకు ఒక పాఠంగా నిలిచింది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×