E-Paper
Advertisement

Paris Olympics Sajjan Jindal| ఒలింపిక్స్ పతక విజేతలందరికీ ప్రత్యేక బహుమతి.. స్పెషల్ గిఫ్ట్ ప్రకటించిన జిందాల్!

Paris Olympics Sajjan Jindal| ఒలింపిక్స్ పతక విజేతలందరికీ ప్రత్యేక బహుమతి.. స్పెషల్ గిఫ్ట్ ప్రకటించిన జిందాల్!

Paris Olympics Sajjan Jindal| పారిస్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన ప్రతీ ఆటగాడికి ఓ ప్రత్యేక బహుమతి ప్రకటించారు ప్రముఖ బిలయనీర్ బిజినెస్ మేన్ సజ్జన్ జిందాల్. జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ట్విట్టర్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. ఒలింపిక్స్ పతక విజేతలందరికీ యంజి విండ్సర్ కారు బహుమానంగా ప్రకటిస్తూ ‘ఏకాగ్రతతో విజయం సాధించిన మన బెస్ట్ ఆటగాళ్లకు బెస్ట్ బహుమతి’ అని తన ట్వీట్ లో రాశారు.

ఇటీవల లండన్ కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ మారిస్ గరాజెస్ తన యంజి విండ్సర్ కారుని ఇండియాలో తయారు చేయడానికి జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ తో జాయింట్ వెంచర్ ప్రకటించింది.

Also Read: మను భాకర్ కోచ్‌కు షాక్.. ఇంటిని కూల్చేస్తామని నోటీసు

ట్వట్టర్ లో జిందాల్ పోస్ట్‌కు ఇప్పటివరకు లక్ష ఆరు వేల వ్యూస్, దాదాపు 800 లైక్స్ వచ్చాయి.

జిందాల్ ట్విట్ పై చాలామంది నెటిజెన్లు స్పందించారు. ‘చాలా గొప్ప నిర్ణయం’ అని క్లాపింగ్ ఇమోజీ తో ఒక నెటిజెన్ పోస్ట్ చేస్తే.. మరొకరు ‘మన ఒలింపిక్స్ విజేతలకు ఇలాంటి ప్రత్యేక బహుమతితో సెల్యూట్ చేస్తున్న జెఎస్‌డబ్ల్యూ గ్రూప్, సజ్జన్ జిందాల్.. మీరు ఇండియన్ స్పిరిట్ ఒక నిదర్శనం’ అని రాశారు.

చాలామంది నెటిజెన్లు థంబ్స్ అప్ ఇమోజీతో జిందాల్ ట్వీట్ ని మెచ్చుకున్నారు.

ఈసారి ఒలింపిక్స్ వెళ్లిన భారత ఆటగాళ్లందరికీ అధికారికంగా యూనిఫార్మ్ డ్రెస్ స్పాన్సర్ కూడా జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ కంపెనీ కావడం విశేషం. కంపెనీ వెబ్ సైట్ లో ఉన్న వివరాల ప్రకారం.. భారత సంప్రదాయం, భౌగోళిక గుర్తులతో పాటు.. ఆటగాళ్లు సౌకర్యాలని దృష్టిలో పెట్టుకొని ఒలింపిక్స్ యూనిఫార్మ్ తయారు చేశారు.

Also Read: హాకీలో భారత్ విజయం.. 52 ఏళ్లలో ఆస్ట్రేలియాపై గెలవడం ఇదే తొలిసారి

ఇప్పటివరకు భారత్ కు పారిస్ ఒలింపిక్స్ లో మూడు పతకాలు లభించాయి. మనూ భాకెర్ రెండు కాంస్య పతకాలు సాధించగా.. స్వప్నిల్ కుసాలె ఒక కాంస్య పతకం సాధించాడు. ఈ మూడు కూడా షూటింగ్ గేమ్ లోనే లభించడం గమనార్హం.

Also Read: బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్ రికార్డ్.. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి లక్ష్య సేన్

Related News

గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇకపై ఆ కోడ్ లేకపోతే సిలిండర్ రానట్లే!

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

Big Stories

×