E-Paper
Advertisement

Recharge plan: మొబైల్ రీచార్జ్ ధరలు భారీగా పెంపు.. చౌక ధరల్లో జియో ప్లాన్స్

Recharge plan: మొబైల్ రీచార్జ్ ధరలు భారీగా పెంపు.. చౌక ధరల్లో జియో ప్లాన్స్

Recharge plan: మొబైల్ యూజర్లకు టెలికాం సంస్థలు షాక్ ఇచ్చాయి. భారీగా మొబైల్ రీచార్జ్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా టెలికాం కంపెనీల్లో దిగ్గజ కంపెనీ అయిన రిలయన్స్ జియోతో సహా ఎయిల్ టెల్, వోడాఫోన్, ఐడియా కూడా రీచార్జ్ ధరల్లో మార్పులు చేశాయి. తాజా మార్పులను మిగతా కంపెనీలతో పోలిస్తే జియో అమలు చేయబోయే కొత్త ప్లాన్స్ అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉండబోతున్నాయి.

కాగా, ఇటీవల జియో కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీచార్జ్ ధరలను దాదాపు 10 నుంచి 21 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. అయితే జియో పెంచిన అనంతరం ఎయిర్‌టెల్ కూడా 25 శాతం వరకు పెంచింది. జియో చార్జీలను పెంచినా కూడా మిగతా కంపెనీల కంటె తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. జియో 1 జీబీ డేటా అన్ లిమిటెడ్ ప్లాన్ రూ. 249లకే అందుబాటులోకి రానుంది. మరోవైపు ఎయిర్ టెల్ ప్లాన్ రూ. 299లకు అందుబాటులో ఉండనుంది. దీంతో ఎయిర్ టెల్ కంటే జియో 20 శాతం తక్కువ ధరకే ప్లాన్ ను ఇవ్వనుంది. ఇక 1.5జీబీ జియో అన్ లిమిటెడ్ ప్లాన్ కోసం రూ. 299లకు అందుబాటులోకి తెచ్చింది.

ఎయిర్‌టెల్ ప్లాన్ :

డెయిలీ 2 జీబీ డెటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లానింగ్ తో జియో రూ. 349లకు అందుబాటులోకి తీసుకువస్తుంది. మరోవైపు ఇదే ప్లాన్ ను ఎయిర్ టెల్ రూ. 379లకు యూజర్లకు అందిస్తుంది. దీంతో 9 శాతం తక్కువకే జియో ప్లాన్ అందిస్తుంది. జియోలో 3 నెలల ప్లాన్ 6జిబి డెటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను రూ. 479లకే అందుబాటులో తెచ్చింది. ఇందులో మరో రూ. 30 ఎక్కువ ధరకు ఎయిర్ టెల్ అందిస్తోంది. మరోవైపు సంవత్సరం పాటు 24 జిబీ డెటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ను జియో రూ. 1899లకే అందిస్తుండగా.. ఎయిర్ టెల్ దీనిని రూ. 1999లకే అందిస్తోంది.

Tags

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×