E-Paper
Advertisement

రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ సింఘానియా ఇక లేరు

రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ సింఘానియా ఇక లేరు

Vijaypat Singhania: రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ సింఘానియా ఇక లేరు. ఆయన వయస్సు 87 ఏళ్లు. గతరాత్రి ఆయన ముంబైలో కన్నుమూశారు. ఈ విషయాన్ని సింఘానియా కుటుంబసభ్యులు తెలిపారు. విజయ్‌పత్ ఇక లేరన్న విషయాన్ని ఆయన కొడుకు, రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా ఎక్స్ వేదికగా వెల్లడించారు.

రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయ్‌పత్ సింఘానియా ఇక లేరు

ప్రముఖ వస్త్ర పరిశ్రమ రేమండ్ మాజీ ఛైర్మన్, కార్పొరేట్ దిగ్గజం, విమానయాన నిపుణుడు, విజయపత్ సింఘానియా శనివారం రాత్రి ముంబైలో మరణించారు. 87 ఏళ్లు కలిగిన ఆయన అనారోగ్యం క్షీణించడంతో శుక్రవారం ఆసుపత్రిలో చేర్చారు. శనివారం రాత్రి ఆయన మరణించారు. ఆదివారం చందన్‌వాడి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

వ్యాపార కుటుంబానికి చెందిన విజయపత్ సింఘానియా రెండు దశాబ్దాలకు పైగా రేమండ్ వస్త్ర గ్రూప్ ఛైర్మన్‌గా పని చేశారు. రేమండ్ అంటే విజయపత్ అనే స్థాయికి ఆయన తీసుకెళ్లారు. 1980-2000 మధ్యకాలంలో రేమండ్‌ వస్త్రాలకు విశేషమైన ప్రాచుర్యం కల్పించారు. ఒకప్పుడు రేమండ్ దస్తులు వేసుకోవడానికి వినియోగదారులు అమితంగా ఇష్టపడేవారు కూడా.

ఏవియేటర్‌గా విజయ్‌పత్ సింఘానియా మరో అడుగు 

1938 అక్టోబర్ 4న జన్మించిన విజయ్‌పత్ సింఘానియా 1980లో రేమండ్ గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో రేమండ్‌ను శక్తివంతమైన సంస్థగా తయారు చేయడంలో ఆయనది కీలకపాత్ర. పురుషుల ఫ్యాషన్ రంగంలో రేమండ్ అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో ఒకటిగా మార్చేశారు.

బిజినెస్‌మేన్‌గా కాకుండా మంచి ఏవియేటర్ గా పేరు సంపాదించుకున్నారు. 5 వేలకు పైగా విమానం నడిపిన అనుభవం ఆయన సొంతం. అంతేకాదు 67 ఏళ్ల వయస్సులో హాట్ ఎయిర్ బెలూన్‌లో అత్యధిక ఎత్తుకు ప్రయాణించిన వ్యక్తిగా విజయపత్ రికార్టులకు ఎక్కారు. ఆయనకు 2006లో పద్మభూషణ్ పురస్కారం వరించింది.

ALSO READ: ఈ గ్యాస్ ల ఉపయోగాలు, తేడాలేంటి?

ఆయన చైర్మన్‌గా పదవీకాలం చివరిలో అనేక ఒడిదుడుకులు మొదలయ్యాయి. ఓ వైపు ఆర్థిక మాంద్యం, ఉక్కు-సిమెంట్ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చివరికి కొన్ని వ్యాపారాలను ఆయన అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రెండ్‌కు అనుగుణంగా అడుగులు వేసే విజయ్ పథ్ సింఘినియా, నాయకత్వాన్ని తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు అప్పగించారు. ఆనాటి నుంచి వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

 

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×