E-Paper
Advertisement

Chittoor Crime News: చిత్తూరు గ్యాంగ్ రేప్.. నిందితులను నడిరోడ్డుపై ఊరేగించిన పోలీసులు, జనాలు ఏం చేశారంటే?

Chittoor Crime News: చిత్తూరు గ్యాంగ్ రేప్.. నిందితులను నడిరోడ్డుపై ఊరేగించిన పోలీసులు, జనాలు ఏం చేశారంటే?

Chittoor Crime News: చిత్తూరు జిల్లాలో గత నెల 25న జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురు  యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.. నిందితులు కిషోర్, మహేశ్, హేమంత్‌లను గుడిపల్లె దగ్గర అరెస్ట్ చేశారు. అయితే ఈ ముగ్గురు నిందితులు బయట ఎక్కడైనా ప్రేమజంట కనిపిస్తే చాలు.. వారిని వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు, నగలు తీసుకుని వేధించేవారు.

అలా గత సెప్టెంబర్ 25వ తేదీనా ఓ ప్రేమజంటను బెదిరించి ఒకరి తర్వాత మరొకరు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక తల్లిదండ్రులు ఆలస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా గ్రామస్థులు అప్పటికే ముగ్గుర్ని పట్టుకుని దేహశుద్ది చేశారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసులో పలు సెక్షన్ల క్రింద చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా POCSO Act, SC/ST Atrocities Act, రాబరీ, హత్యాయత్నం, కిడ్నాప్ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు గణనీయమైన ముందస్తు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు గుర్తించిన వీడియో సాక్ష్యాలు, ఫిర్యాదులను ఆధారంగా కోర్టులో దాఖలు చేస్తున్నారు.

Also Read: తిరుపతి ఉలిక్కిపడేలా బాంబు బెదిరింపులు

ఇందులో ఏ1 మహేష్ పై గతంలో మైనర్ బాలికను వేధించిన ఘటనపై కేసు నమోదు అయింది. గతంలో పాల్పడిన ఘటనకు సంబంధించి ఐదు వీడియోలను పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ ముగ్గురు నిందితులను పోలీసులు కోర్టుకి హాజరుపరచడానికి రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు. అలా ఈ ముగ్గురు నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్తుంటే.. పెద్ద ఎత్తున స్థానికులు అక్కడ చేరి ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూశారు. నిందితులను బూతులతో తిట్టిపోశారు. కొంతమంది కొట్టడానికి కూడా ముందుకు వచ్చారు. అయితే పోలీసులు వారిని వారించారు. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయంగా మారింది.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×