E-Paper
Advertisement

Chittoor Crime News: చిత్తూరు గ్యాంగ్ రేప్.. నిందితులను నడిరోడ్డుపై ఊరేగించిన పోలీసులు, జనాలు ఏం చేశారంటే?

Chittoor Crime News: చిత్తూరు గ్యాంగ్ రేప్.. నిందితులను నడిరోడ్డుపై ఊరేగించిన పోలీసులు, జనాలు ఏం చేశారంటే?
Advertisement

Chittoor Crime News: చిత్తూరు జిల్లాలో గత నెల 25న జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురు  యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.. నిందితులు కిషోర్, మహేశ్, హేమంత్‌లను గుడిపల్లె దగ్గర అరెస్ట్ చేశారు. అయితే ఈ ముగ్గురు నిందితులు బయట ఎక్కడైనా ప్రేమజంట కనిపిస్తే చాలు.. వారిని వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు, నగలు తీసుకుని వేధించేవారు.

అలా గత సెప్టెంబర్ 25వ తేదీనా ఓ ప్రేమజంటను బెదిరించి ఒకరి తర్వాత మరొకరు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక తల్లిదండ్రులు ఆలస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా గ్రామస్థులు అప్పటికే ముగ్గుర్ని పట్టుకుని దేహశుద్ది చేశారు.

Advertisement

తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసులో పలు సెక్షన్ల క్రింద చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా POCSO Act, SC/ST Atrocities Act, రాబరీ, హత్యాయత్నం, కిడ్నాప్ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు గణనీయమైన ముందస్తు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు గుర్తించిన వీడియో సాక్ష్యాలు, ఫిర్యాదులను ఆధారంగా కోర్టులో దాఖలు చేస్తున్నారు.

Also Read: తిరుపతి ఉలిక్కిపడేలా బాంబు బెదిరింపులు

Advertisement

ఇందులో ఏ1 మహేష్ పై గతంలో మైనర్ బాలికను వేధించిన ఘటనపై కేసు నమోదు అయింది. గతంలో పాల్పడిన ఘటనకు సంబంధించి ఐదు వీడియోలను పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ ముగ్గురు నిందితులను పోలీసులు కోర్టుకి హాజరుపరచడానికి రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు. అలా ఈ ముగ్గురు నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్తుంటే.. పెద్ద ఎత్తున స్థానికులు అక్కడ చేరి ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూశారు. నిందితులను బూతులతో తిట్టిపోశారు. కొంతమంది కొట్టడానికి కూడా ముందుకు వచ్చారు. అయితే పోలీసులు వారిని వారించారు. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయంగా మారింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×