E-Paper
Advertisement

Vande Bharat Accident: రైలు పట్టాలపై కుర్రాళ్లు రీల్స్.. వందే భారత్ దూసుకురావడంతో.. స్పాట్‌లోనే నలుగురు!

Vande Bharat Accident: రైలు పట్టాలపై కుర్రాళ్లు రీల్స్.. వందే భారత్ దూసుకురావడంతో.. స్పాట్‌లోనే నలుగురు!

Vande Bharat Accident: ఇటీవల కాలంలో రీల్స్ పేరుతో కొందరు పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ముఖ్యంగా రైళ్లలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రీల్స్ తీసుకుంటున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి పాపులారిటీ కోసం పాకులాడుతున్నారు. అయితే ఈ స్టంట్స్ ఒక్కోసారి ప్రాణాలు తీస్తున్నాయి.

ప్రమాద సమయంలో ఐదుగురు

బీహార్‌లో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. వందే భారత్ రైలు వచ్చే ట్రాక్ పై రీల్స్ చేస్తూ నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం సమయంలో ఐదుగురు టీనేజర్లు రైలు ట్రాక్ పై రీల్స్ షూట్ చేస్తున్నారు.

ఒకరికి తీవ్ర గాయాలు

శుక్రవారం ఉదయం బీహార్‌లోని పూర్ణియాలో రైల్వే ట్రాక్‌పై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేస్తున్న నలుగురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైయ్యాడు. దుర్గా పూజ ఉత్సవానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ట్రాక్ పై రీల్స్

“శుక్రవారం ఉదయం 4.54 గంటలకు పూర్ణియా, కస్బా రైల్వే స్టేషన్ల మధ్య జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొని నలుగురు టీనేజర్లు మృతి చెందారని మాకు సమాచారం అందింది. ఈ సంఘటన జరిగినప్పుడు వారు ట్రాక్‌పై రీల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది” అని నార్తర్న్ ఫ్రాంటియర్ రైల్వేస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఓ ప్రకటనలో తెలిపారు.

జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను గత నెల సెప్టెంబర్ 15న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది అరారియా, పూర్ణియా, మాధేపురా, సహర్సా, ఖగారియా, బెగుసరాయ్, సమస్తిపూర్, ముజఫర్‌పూర్, వైశాలి, పాట్నా జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది.

Also Read: Hyderabad Crime News: పెదనాన్న పరువు తీస్తున్నాడని యువతి సూసైడ్, హైదరాబాద్‌లో దారుణం

బాధితులకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ మాట్లాడుతూ.. “ఇది పరిపాలన నిర్లక్ష్యం. బీహార్‌లోని అనేక చోట్ల రైల్వే అండర్‌పాస్, ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది, కానీ అది జరగడం లేదు. మరణించిన వారు మా ప్రాంతానికి చెందినవారు. వారు దళిత కుటుంబానికి చెందిన యువకులు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలి. ఈ సంఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖను డిమాండ్ చేస్తున్నాను” అని అన్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×