E-Paper
Advertisement

MP Tractor Accident: దుర్గమ్మ నిమజ్జనంలో అపశ్రుతి.. చెరువులో ట్రాక్టర్ బోల్తా.. 10 మంది మృతి

MP Tractor Accident: దుర్గమ్మ నిమజ్జనంలో అపశ్రుతి.. చెరువులో ట్రాక్టర్ బోల్తా.. 10 మంది మృతి

MP Tractor Accident: మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఖాండ్వా జిల్లాలో దుర్గామాత నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్ చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.

నిమజ్జనం సమయంలో ట్రాక్టర్‌ చెరువులోకి దూసుకెళ్లి బోల్తా కొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో యువతులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 30 నుంచి 32 మంది ఉన్నట్లు సమాచారం.

నిమజ్జనంలో విషాదం

ఖాండ్వా జిల్లా పంధానాలోని అర్దాలా గ్రామంలో దుర్గమ్మ విగ్రహం నిమజ్జనం కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాక్టర్ పై విగ్రహాన్ని చెరువు వద్దకు తీసుకెళ్తున్న సమయంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి చెరువులో బోల్తా పడిపోయింది. దీంతో ట్రాక్టర్ ట్రక్ లో ఉన్న వారు నీటిలో మునిగిపోయారు. వెంటనే స్థానికులు స్పందించి జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను బయటకు తీశారు. స్థానికులు 11 మందిని రక్షించారు. మిగతా వారికోసం గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మృతుల సంఖ్య పెరగవచ్చు

విజయదశమి నాడు దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం కోసం తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ జమాలి సమీపంలోని అబ్నా నదిలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు మునిగిపోయారు.

చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఓపీ జుగ్తావత్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా విషాదకరమైన సంఘటన. పంధాన ప్రాంతంలో ట్రాక్టర్ బోల్తా పడి దాదాపు 10 మంది మరణించారు. గాయపడిన వారిని పంజానా ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురిని ఖాండ్వా జిల్లా ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్ ట్రాలీలో దాదాపు 30 నుండి 32 మంది ఉన్నారని తెలుస్తోంది. మరణాల సంఖ్య పెరగవచ్చు. ఎస్పీ, ఆరోగ్య బృందంతో సహా జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలంలో ఉన్నారు’ అని అన్నారు.

14 మంది గల్లంతు

ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిన తర్వాత అందులో ఉన్న వారు సహాయం కోసం కేకలు వేశారని ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. నిమజ్జన వేడుక కోసం చెరువు వద్ద ఎక్కువ మంది ఉండటంతో వాళ్లు వెంటనే స్పందించి కొంతమందిని రక్షించారు. ఈ ప్రమాదంలో దాదాపు 14 మంది గల్లంతయ్యారు. 10 మంది మృతదేహాలు వెలికితీశారు.

Also Read: MP Couple Buries Child: కన్నబిడ్డను సజీవ సమాధి.. ఉద్యోగం కోసం తల్లిదండ్రులు దారుణం

సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మరణించిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు.

 

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×