E-Paper
Advertisement

హైటెక్ సిటీలో అర్ధరాత్రి దారుణం.. డీసీఎం వాహనం బీభత్సం, స్కూటీని ఢీకొట్టి 5 కి.మీ ఈడ్చుకెళ్లింది

హైటెక్ సిటీలో అర్ధరాత్రి దారుణం.. డీసీఎం వాహనం బీభత్సం, స్కూటీని ఢీకొట్టి 5 కి.మీ ఈడ్చుకెళ్లింది

Hi Tech City: హైదరాబాద్ హైటెక్ సిటీలో అర్ధరాత్రి దారుణం జరిగింది. ఓ డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. స్కూటీని ఢీకొట్టిన డీసీఎం వాహనం, ఏకంగా 5 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళా స్పాట్‌లో మృతి చెందింది. ఘటన తర్వాత అక్కడి నుంచి డ్రైవర్ పరారయ్యాడు. అసలేం జరిగింది?

హైదరాబాద్ హైటెక్ సిటీలో అర్ధరాత్రి దారుణం

హైదరాబాద్ హైటెక్ సిటీలో అర్ధరాత్రి ఓ డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. మాదాపూర్‌ సమీపంలోని మైండ్‌స్పేస్‌ పరిసరాల్లో వేగంగా వచ్చిన డీసీఎం, భార్యాభర్తలు ప్రయాణిస్తున్న స్కూటీని బలంగా ఢీ కొట్టింది. దీంతో డీసీఎం కింద స్కూటీ ఇరుక్కుపోయింది. కానీ డీసీఎం డ్రైవరు ఆగకుండా జూబ్లీహిల్స్‌ వరకు వెళ్లిపోయాడు.

దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు పోనిచ్చాడు. దీన్ని గమనించిన కొందరు వ్యక్తులు డీసీఎం వాహనాన్ని వెంటాడి మరీ అడ్డుకున్నారు. ప్రజలను గమనించిన డ్రైవర్ వాహనాన్ని వదలి అక్కడి నుంచి పారిపోయాడు. క్లీనర్ అడ్డంగా దొరికిపోయాడు. ఆగ్రహంతో రెచ్చిపోయిన స్థానికులు కోపోద్రిక్తులైన స్థానిక ప్రజలు సహాయకుడిని చితకబాదారు.

డీసీఎం వాహనం బీభత్సం, స్కూటీని ఢీకొట్టి 5 కి.మీ ఈడ్చుకెళ్లింది

ఘటన గురించి తెలియగానే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వాహనం క్లీనర్‌ని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఒకరు మృతి చెందిగా, మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.

కేసు నమోదు చేసిన పోలీసులు, వివరాలు సేకరిస్తున్నారు. మలబార్ బంగారం షాపులో పని చేస్తున్నారు భార్యాభర్తలు. కూకట్‌పల్లిలో సినిమా చూసి మహేశ్వరం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భర్త పేరు అబ్దుల్ బాసిత్ కాగా, ఆమె భార్య పేరుహానియా అయేషా. నెంబర్ ప్లేట్ ఆధారంగా డీసీఎం వాహనం ఎవరిది? అనేదానిపై ఆరా తీస్తున్నారు.

ALSO READ: లోయలో పడిన ట్రావెల్ వాహనం.. స్పాట్‌లో 22 మంది, కుల్లు ప్రాంతంలో ఘటన

 

Related News

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

Big Stories

×