West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని లంకలకోడేరులో ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణతో మెలగాలని, పద్ధతిగా ఉండాలని బుద్ధి చెప్పినందుకు ఒక పూర్వ విద్యార్థి తన గురువుపైనే పాశవిక దాడికి ఒడిగట్టాడు. వెంకట సురేష్ అనే ఉపాధ్యాయుడు ఆర్యదీప్ అనే యువకుడిని గతంలో మందలించినట్లు తెలుస్తోంది. సక్రమ మార్గంలో నడవాలని, భవిష్యత్తును పాడుచేసుకోవద్దని టీచర్ చెప్పిన మాటలను సదరు యువకుడు పాజిటివ్గా తీసుకోలేకపోయాడు.
ఆ మాటలను మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్న ఆర్యదీప్, అదను చూసి ఇనుప రాడ్డుతో టీచర్ వెంకట సురేష్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘర్షణలో ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఒకప్పుడు విద్యను అందించిన గురువుపైనే ఇలా రాడ్డుతో దాడి చేయడం స్థానికంగా పెను కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Also Read: జగన్ రక్తంలోనే అది ఉంది.. మంత్రి సవిత షాకింగ్ కామెంట్స్!
టీచర్ పై ఇనుపరాడ్డుతో పూర్య విద్యార్థి దాడి
సక్రమ మార్గంలో నడుచుకోవాలని చెప్పినందుకు టీచర్ పై కక్ష
ఆర్యదీప్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ టీచర్ వెంకట సురేష్
పాలకొల్లు మండలం లంకల కోడేరులో దారుణం
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Former Student Attacks Teacher with Iron Rod
Grudge… pic.twitter.com/6NE3KgJOvJ— BIG TV Breaking News (@bigtvtelugu) April 23, 2026