E-Paper
Advertisement

రెండేళ్ల పగ.. టీచర్ ను రాడ్డుతో కొట్టిన స్టూడెంట్

రెండేళ్ల పగ.. టీచర్ ను రాడ్డుతో కొట్టిన స్టూడెంట్

West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని లంకలకోడేరులో ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణతో మెలగాలని, పద్ధతిగా ఉండాలని బుద్ధి చెప్పినందుకు ఒక పూర్వ విద్యార్థి తన గురువుపైనే పాశవిక దాడికి ఒడిగట్టాడు. వెంకట సురేష్ అనే ఉపాధ్యాయుడు ఆర్యదీప్ అనే యువకుడిని గతంలో మందలించినట్లు తెలుస్తోంది. సక్రమ మార్గంలో నడవాలని, భవిష్యత్తును పాడుచేసుకోవద్దని టీచర్ చెప్పిన మాటలను సదరు యువకుడు పాజిటివ్‌గా తీసుకోలేకపోయాడు.

ఆ మాటలను మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్న ఆర్యదీప్, అదను చూసి ఇనుప రాడ్డుతో టీచర్ వెంకట సురేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘర్షణలో ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఒకప్పుడు విద్యను అందించిన గురువుపైనే ఇలా రాడ్డుతో దాడి చేయడం స్థానికంగా పెను కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Also Read: జగన్ రక్తంలోనే అది ఉంది.. మంత్రి సవిత షాకింగ్ కామెంట్స్!

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×