E-Paper
Advertisement

Ex BJP Leader Pocso Case: చిన్నారిపై లైంగిక దాడి కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు.. మాజీ బీజేపీ నేతకు జీవిత ఖైదు

Ex BJP Leader Pocso Case: చిన్నారిపై లైంగిక దాడి కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు.. మాజీ బీజేపీ నేతకు జీవిత ఖైదు
Advertisement

Ex BJP Leader Pocso Case: చిన్నారిపై లైంగిక వేధింపుల కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మాజీ బీజేపీ నేత పద్మరాజన్ కు జీవిత ఖైదు విధించింది. తలస్సేరి కేసులో పోక్సో ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. బీజేపీకి చెందిన త్రిప్పంగొట్టూరు పంచాయతీ మాజీ అధ్యక్షుడు కె. పద్మరాజన్ (49) కేరళలోని కన్నూర్‌ పలతాయిలోని ఒక పాఠశాలలో 4వ తరగతి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దోషిగా తేల్చింది. పోక్సో కోర్టు న్యాయమూర్తి జలజా రాణి శనివారం ఈ మేరకు శిక్షను ఖరారు చేశారు.

చిన్నారిపై లైంగిక దాడి

పద్మరాజన్ చిన్నారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. 2020 జనవరిలో 4వ తరగతి చదువుతున్న చిన్నారిని పాఠశాల బాత్రూమ్‌కు తీసుకెళ్లి మూడుసార్లు లైంగికంగా వేధించాడు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ బాలికతో సహా 40 మంది సాక్షులను విచారించింది. పిల్లల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అయితే పద్మరాజన్ తన పలుకుబడిన ఉపయోగించి బాలిక వాంగ్మూలాన్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నించడంతో వివాదానికి దారితీసింది. దీంతో హైకోర్టు జోక్యం చేసుకుని కేసు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించింది. దీంతో పోక్సో చట్టం నిబంధనల మేరకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.

హైకోర్టు జోక్యంతో

Advertisement

మార్చి 17, 2020న బాలిక చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేసి పద్మరాజన్ తనపై వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఏప్రిల్ 15న విలకొత్తూరులో అతడ్ని అరెస్టు చేశారు. బాలికకు వేధింపులకు సంబంధించిన తేదీలు గుర్తులేకపోవడంతో కొందరు పోలీసులు కేసును బలహీనపరిచేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడు సెలవులో ఉన్న తేదీలు, పిల్లవాడిని పరీక్షించిన తేదీలు మాత్రమే నమోదు చేశారు. అలాగే అంతగా తీవ్రతలేని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పద్మరాజన్ బెయిల్ విడుదలయ్యాడు. ఆ తర్వాత బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించింది.

పోలీసుల తప్పుడు నివేదిక

దీంతో పాటు క్రైమ్ బ్రాంచ్ ఐజీ ఎస్. శ్రీజిత్ చిన్నారి రహస్య వాంగ్మూలాన్ని బయటపెట్టడంతో మరో వివాదానికి దారితీసింది. బాలిక తల్లి నిందితుడి బెయిల్ రద్దు చేయాలని కోరినప్పుడు చిన్నారి అబద్ధం చెప్పిందని పోలీసులు నివేదికను సమర్పించారు. విచారణ సమయంలో పాఠశాల మాజీ హెడ్ మాస్టర్ దినేశన్ నిందితులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పారు. లైంగిక వేధింపుల తర్వాత బాలిక నెలల తరబడి పాఠశాలకు హాజరు కాకపోయినా, ఆమె స్కూల్ కు వచ్చినట్లు హాజరు వేశారు. మధ్యాహ్న భోజన భత్యం కూడా కొనసాగించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరికి నేరం రుజువు కావడంతో పద్మరాజన్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×