E-Paper
Advertisement

Bride Murder : పెళ్లిపందిరిలో నవవధువు హత్య.. వరుడి పరిస్థితి ?

Bride Murder : పెళ్లిపందిరిలో నవవధువు హత్య.. వరుడి పరిస్థితి ?
Advertisement

పెళ్లైన కాసేపటికే నవవధుకు హత్యకు గురైంది. ఈ ఘటన కర్ణాటకలోని కేజీఎఫ్ తాలూకా త్యంబరసనహళ్లి గ్రామంలో జరిగింది. లిఖితశ్రీ, నవీన్ లకు ఆగస్టు 7, బుధవారం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన అనంతరం పెద్దల ఆశీస్సులు తీసుకుని.. ఇద్దరూ మాట్లాడుకునేందుకు పక్కనే ఉన్న గదిలోకి వెళ్లారు.

కాసేపటికి గదిలో నుంచి అరుపులు వినిపించాయి. మాట్లాడుకోవాలని గదిలోకి వెళ్లిన ఇద్దరూ గొడవపడ్డారు. చేతికి అందిన వస్తువులతో ఒకరినొకరు గాయపరుచుకున్నారు. ఇంతలో గది తలుపులు తెరిచిన పెద్దలు తీవ్రంగా గాయపడిన నవ దంపతుల్ని కేజీఎఫ్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ వధువు లిఖిత మృతి చెందింది.

Advertisement

నవీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. అతడిని కోలారు ఆస్పత్రికి తరలించారు. అయితే పెళ్లైన గంటకే నవ దంపతులు ఒకరిపై ఒకరు ఎందుకు దాడి చేసుకున్నారు ? వారిద్దరి మధ్య గొడవకు కారణమేంటన్నది తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×