E-Paper
Advertisement

Bride Murder : పెళ్లిపందిరిలో నవవధువు హత్య.. వరుడి పరిస్థితి ?

Bride Murder : పెళ్లిపందిరిలో నవవధువు హత్య.. వరుడి పరిస్థితి ?

పెళ్లైన కాసేపటికే నవవధుకు హత్యకు గురైంది. ఈ ఘటన కర్ణాటకలోని కేజీఎఫ్ తాలూకా త్యంబరసనహళ్లి గ్రామంలో జరిగింది. లిఖితశ్రీ, నవీన్ లకు ఆగస్టు 7, బుధవారం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన అనంతరం పెద్దల ఆశీస్సులు తీసుకుని.. ఇద్దరూ మాట్లాడుకునేందుకు పక్కనే ఉన్న గదిలోకి వెళ్లారు.

కాసేపటికి గదిలో నుంచి అరుపులు వినిపించాయి. మాట్లాడుకోవాలని గదిలోకి వెళ్లిన ఇద్దరూ గొడవపడ్డారు. చేతికి అందిన వస్తువులతో ఒకరినొకరు గాయపరుచుకున్నారు. ఇంతలో గది తలుపులు తెరిచిన పెద్దలు తీవ్రంగా గాయపడిన నవ దంపతుల్ని కేజీఎఫ్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ వధువు లిఖిత మృతి చెందింది.

నవీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. అతడిని కోలారు ఆస్పత్రికి తరలించారు. అయితే పెళ్లైన గంటకే నవ దంపతులు ఒకరిపై ఒకరు ఎందుకు దాడి చేసుకున్నారు ? వారిద్దరి మధ్య గొడవకు కారణమేంటన్నది తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×