E-Paper
Advertisement

Srisailam Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు

Srisailam Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు

Srisailam Road: హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్డులో దారుణం జరిగింది. ఈగలపెంట మైసమ్మ గుడి వద్ద అర్ధరాత్రి సమయంలో భక్తులతో వెళ్తున్న కారు దగ్ధమైంది. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ఆరుగురు భక్తులు మల్లన్న దర్శనానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈగలపెంట సమీపంలో కారు ఇంజన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే దిగారు. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు సురక్షితంగా బయటపడగా, కారులో భారీగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బ్రహ్మగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న టయోటా ఫార్చునర్ కారు ఘోర ప్రమాదానికి చోటుచేసుకుంది. నవంబర్ 8 శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కృష్ణగిరి ఈగలపెంట వద్ద ఈ దారుణ ఘటన జరిగింది. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ప్రణవ్ కుమార్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం బయలుదేరాడు. వారు ప్రయాణిస్తున్న టయోటా ఫార్చునర్ కారులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి.

అయితే ప్రణవ్ కుమార్ కారు ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించి వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేశాడు. కుటుంబ సభ్యులందరినీ సురక్షితంగా కారు నుంచి దించేశాడు. వారు దిగిన కొద్దిసేపటికే మంటలు వ్యాపించి కారు మొత్తం దగ్ధమైంది. వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బంది కాల్ చేశారు.. కానీ, ఫైర్ ఇంజిన్ ఘటనాస్థలికి చేరుకునేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. అయితే, ప్రయాణికులు సకాలంలో కారు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ గాయాలు కాలేదు.

Also Read: కాలేజీలే అడ్డాగా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా.. ఈగల్ టీమ్ దాడులు

ఈ ప్రమాదం వల్ల హైవేపై భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. శ్రీశైలం ఘాట్ రోడ్డు భాగంలో వాహనాల రాకపోకలు కొంతసేపు అంతరాయం కలిగాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగినట్లు తేలింది.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×