E-Paper
Advertisement

CM Buddhadeb no more: మాజీ సీఎం బుద్దదేవ్ ఇక లేరు

CM Buddhadeb no more: మాజీ సీఎం బుద్దదేవ్ ఇక లేరు
Advertisement

Buddhadeb bhattacharya death news(Today news paper telugu): వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. గురువారం ఉదయం కోల్‌కతాలో తన నివాసంలో మరణించారు. ఆయనకు భార్య మీరా, కుమార్తె సుచేతన ఉన్నారు.

కొన్నాళ్లుగా బుద్దదేవ్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఇవాళ ఉదయం 8 గంటల 20 నిమిషా లకు తుది శ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. దక్షిణ కోల్‌కత్తాలోని బల్లిగంజ్ ప్రాంతంలో ఆయన ఉంటున్నారు.

Advertisement

బుద్దదేవ్ భట్టాచార్య 2000-2011 వరకు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన సమయంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. బెంగాల్‌కు చివరి మార్క్సిస్ట్ ముఖ్యమంత్రి భట్టాచార్య. ఆయన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

ALSO READ:  ముక్కలైన కాళీ బ్రిడ్జి.. అసలేం జరిగింది?

Advertisement

జ్యోతిబసు తర్వాత బెంగాల్‌ను పారిశ్రామికీకరణ వైపు తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారాయన. 2001లో భట్టాచార్య అధికారంలోకి రాగానే హుగ్లీలోని సింగూర్‌లో ఆటోమొబైల్ ఫ్యాక్టరీని నిర్మించడానికి టాటా మోటార్స్‌ను ఒప్పించారు. సింగూర్-నందిగ్రామ్‌లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో భూసేకరణకు వ్యతిరేక ఉద్యమాలు చేపట్టారు.

కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీ పూర్వ విద్యార్థి బుద్ధదేవ్. ఆ తర్వాత టీచర్‌గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1977లో తొలిసారి కాశిపుర్-బెల్గాచియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి ఆ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. జ్యోతిబసు హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు కూడా. 2001, 2006ల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించారు.

Related News

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×