E-Paper
Advertisement

అమెరికాలో ఘోర ప్రమాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి తెలుగు యువతి దుర్మరణం

అమెరికాలో ఘోర ప్రమాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి తెలుగు యువతి దుర్మరణం

Telugu Woman: ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో స్థిరపడి కన్నవారికి అండగా ఉండాలనుకున్న ఆ యువతి కలలు నీటిపాలు అయ్యాయి. అమెరికాలో జరిగిన ఒక ఘోర ప్రమాదం ఒక తెలుగు కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. వర్జీనియాలో నివాసముంటున్న వీణ అనే యువతి, స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం స్థానికంగా ఉన్న తెలుగు కమ్యూనిటీని దిగ్భ్రాంతికి గురిచేసింది.

వేడుకలో ఊహించని ప్రమాదం
వివరాల్లోకి వెళ్తే.. వీణ రెండు రోజుల క్రితం ఒక ఫంక్షన్‌లో పాల్గొనేందుకు వర్జీనియా నుండి ఫ్లోరిడాకు వెళ్ళింది. అక్కడ బంధుమిత్రులతో కలిసి సరదాగా గడుపుతున్న సమయంలో, స్విమ్మింగ్ పూల్ వద్ద ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే గమనించిన వారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. వేడుక జరగాల్సిన చోట ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.

లింగోజిగూడలో విషాద చాయలు
వీణ మరణవార్త హైదరాబాద్‌లోని ఆమె స్వగృహానికి చేరడంతో తల్లిదండ్రులు దేవేందర్ రెడ్డి, సునీత కన్నీరుమున్నీరవుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌లో నివసించే ఈ కుటుంబం, తమ గారాబాల పట్టి మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు విదేశాల నుంచి తిరిగి వస్తుందని ఆశించిన ఆ తల్లిదండ్రులకు, ఆమె నిర్జీవంగా వస్తోందన్న వార్త పిడుగులా తగిలింది.

Also Read: తలసేమియా బాధితుల కోసం నెక్లెస్ రోడ్డులో ‘మహా పరుగు’.. హాజరైన నారా భువనేశ్వరి, పలువురు ప్రముఖులు

అండగా నిలిచిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఈ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. వీణ మృతదేహాన్ని వీలైనంత త్వరగా అమెరికా నుండి భారతదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల చర్యలు చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు. విదేశాంగ శాఖతో మాట్లాడి, ప్రవాస భారతీయుల సహాయంతో పార్థివ దేహాన్ని స్వగ్రామానికి చేర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×