E-Paper
Advertisement

Pandari Puram : పండరీ పురానికి ఆపేరు ఎలా వచ్చింది.

Pandari Puram : పండరీ పురానికి ఆపేరు ఎలా వచ్చింది.
Advertisement
Pandari Puram

Pandari Puram : మహారాష్ట్రలోని పండరీపూరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది దేవుడి పేరు ప్రసిద్ధి చెందిన క్షేత్రం కాదు. భక్తుడి పేరుతో ప్రాచుర్యం చెందిన ప్రాంతం. దేవీ దేవతల పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకి భిన్నమైన
ఊరు పండరీపుర క్షేత్రం. భక్తుడి కోరిక మేరకు మండు టెండలో సుదీర్ఘ కాలం నిలబడి తాను భక్తికి కట్టుబడి ఉన్నానని ఆ దేవుడే నిరూపించిన ప్రాంతం కూడా ఇదే. శ్రీకృష్ణుడి మీద అలిగి వచ్చి రుక్మిణిదేవి తప్పస్సు ప్రాంతంగా కూడా పండరీపురమే. శ్రీకృష్ణ భక్తులకి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రాల్లో ఒకటి. శివుడు, కేశవుడు ఇద్దరూ ఒక్కటే నిరూపించిన ప్రాంతాల్లో పండరీపురం నిలుస్తుంది. పండపూరీ పురం ఆధ్యాత్మికంగానే పర్యాటకంగాను యాత్రికులని ఆకర్షించే ప్రాంతం ఇది.

Advertisement

ఆదిశంకరాచార్యుల వారు పాండురంగ అష్టకాన్ని ఇక్కడే రచించారు.అభిషేకం చేసే సమయంలో పాండరంగడ్ని దర్శించుకుంటే కొన్ని విషయాలు గుర్తించవచ్చు. పాండరంగడి తల లింగాకారంలో కనిపిస్తుంది. మహారాష్ట్రలో పాండురంగడుని ఎక్కువ ఆరాధిస్తుంటారు. అలాంటి ప్రాంతాల్లో పండరీపురం కూడా ఒకటి. పూర్వం ఈ ప్రాంతంలో విష్ణుభక్తులైన ఇద్దరు దంపతులు ఉండే వారు. వారి కుమారుడే పుండరీకుడు. చిన్నప్పటి నుంచి చెడు అలవాట్లకు బానిసై బాధ్యత లేకుండా తిరుగుతూ ఉండే వాడు. తల్లిదండ్రుల్ని , భార్యని కూడా ఇబ్బంది పెట్టేవాడు. తమ కుమారుడి జీవితం నాశనం అవడాన్ని చూసి తట్టుకోలేక తల్లిదండ్రులు ఆ దేవుడ్ని వేడుకున్నారు.

తర్వాత పుండరీకుడికి ఎదురైన కొన్ని చేదు అనుభవాలు జ్ఞానాన్ని తెచ్చిపెడతాయి. భక్తిమార్గాన్ని చూపిస్తాయి. కుక్కుటముడు అనే ముని గొప్పతనాన్ని తెలుసుకుని తర్వాత శ్రీవిష్ణు ఆరాధన మొదలుపెడతాడు. తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపంతో తల్లిదండ్రులకి సేవ చేస్తూ గడుపుతూ ఉంటాడు. అలాంటి సమయంలో పుండరీకుడ్ని పరీక్షేందుకు స్వామి బాలుడి రూపంలో వచ్చి బయటకి పిలుస్తాడు. తల్లిదండ్రులకి సేవ చేస్తున్నానని కాసేపు ఆగమంటాడు పుండరీకుడు. అలా సేవ చేస్తూ ఉండపోవడంతో బయట ఎండలోనే బాలుని రూపంలో ఉన్న స్వామి నిలబడి ఉంటారు.కాసేపటికి పుండీరుకుడి ఒక ఇటుకని బయటికి విసిరి దానిపై నిలబడిమని చెబుతాడు. తన భక్తుడు బయటకి వచ్చే వరకు ఎండలో నడుంపై చేతులు వేసుకుని నిలబడి చిద్విలాసంతో ఉంటాడు పాండురంగడు. బయట స్వామి చేసిన విన్యాసాలను చూసి తన తప్పు తెలుసుంటాడు పుండరీకుడు. తల్లిదండ్రులపై అతడి ప్రేమను స్వామి మెచ్చుకుని ఏ వరం కావాలో అడుగమని అదేశిస్తాడు. తనకి దర్శనమిచ్చినట్టుగానే నడుముపైన చేతులతో నిలబడి భక్తుల్ని దర్శనమివ్వమని స్వామి ప్రార్ధిస్తాడట. భక్తుడి కోరిక మన్నించి విష్ణుమూర్తి పాండురంగడు అవతారంలో ఆ క్షేత్రంలో వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×