E-Paper
Advertisement

Samantha: నేను నీ మాటను తీసుకున్నాను..థాంక్యూ.. సమంత పోస్ట్ వైరల్

Samantha: నేను నీ మాటను తీసుకున్నాను..థాంక్యూ.. సమంత పోస్ట్ వైరల్

Samantha: సమంత.. సమంత.. సమంత.. నిన్నటి నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. మంత్రి  కొండా సురేఖ.. సమంత విడాకుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.  నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. అక్కినేని నాగార్జున N  కన్వెన్షన్ ను అడ్డుపెట్టుకొని సమంతను తన దగ్గరకు పంపాలని బ్లాక్ మెయిల్ చేశాడని.. నాగార్జున, సమంతను కేటీఆర్ వద్దకు వెళ్ళమంటే ఆమె నో అని చెప్పడంతో గొడవలు మొదలై.. వెళ్తే కేటీఆర్ దగ్గరకు వెళ్లు.. లేకపోతే విడాకులు తీసుకో అని చెప్పినట్టు ఆమె ఆరోపించారు. ఇక దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం సమంత వైపు తిరిగి చూసింది.

ఇక ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా  కాదు పెద్ద తుఫాన్ లా మారింది. ఒక మహిళపై మరో మహిళ అయిన కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అని ఇండస్ట్రీ మొత్తం ఖండించింది.  అక్కినేని కుటుంబం మొత్తం కొండా సురేఖ చేసి వ్యాఖ్యల్లో నిజం లేదని, ఆమె అన్న మాటలను వెనక్కి  తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమంత సైతం.. తన విడాకులు కేవలం తమ వ్యక్తిగతమని, ఇందులో రాజకీయం ఏమి లేదని తెలిపింది. అంతేకాకుండా రాజకీయ లబ్ది కోసం తమ వ్యక్తిగత విషయాలను రాజకీయం చేయవద్దని కోరింది.

అక్కినేని కోడలుగా అడుగుపెట్టినప్పుడు సమంత ఈ రేంజ్ గా ఫేమస్ అయ్యింది. మళ్ళీ విడాకులు తీసుకున్నప్పుడు ఇంతకంటే ఎక్కువ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎవరిది తప్పు..? సమంత ఏం చేసింది.. ? నాగ చైతన్య తప్పేంటి ..? అక్కినేని ఫ్యామిలీ ఏం చేస్తున్నారు.. ? ఇలా రకరకాల  యాంగిల్స్ లో రకరకాలుగా  విసిగించి.. విసిగించి ఇప్పుడిప్పుడే సైలెంట్  అయిన సోషల్ మీడియాను కొండా సురేఖ వ్యాఖ్యలు మళ్లీ నిద్రలేచేలా చేసాయి.  ఇండస్ట్రీ మొత్తం సామ్ కు సపోర్ట్ గా  నిలబడ్డారు.

నిజం చెప్పాలంటే ఒక మహిళగా ఇలాంటి నిందలు పడడం అంటే మాములు విషయం కాదు. ఈ విషయంలో సమంత గ్రేట్ అనే చెప్పాలి. విడాకుల సమయంలో ఆమె క్యారెక్టర్ ను ఎంతగా దిగజార్చి మాట్లాడారో అందరికి తెల్సిందే.  ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో ఇంటిమేటెడ్ సీన్స్ లో నటించి అక్కినేని కుటుంబం పరువు తీసిందని,  కాస్ట్యూమ్ డిజైనర్ జువాల్కర్ తో ఎఫైర్ నడుపుతుందని.. ఇలా రకరకాలుగా  మాట్లాడి ఆమెను వేధించారు. అయినా సామ్.. వాటిని నవ్వుతూనే స్వీకరించింది. ఇప్పుడు కూడా  అదే నవ్వును ముఖంపై చేరగనివ్వకుండా కాపాడుకుంటుంది.

ఇక తాజాగా సామ్.. వీటన్నింటికి దూరంగా  ఇషా ఫౌండేషన్ లో సేద తీరుతుంది. ఇక నేటి నుంచి దేవి నవరాత్రులు మొదలు కావడంతో.. లింగ భైరవి ఆలయంలో అమ్మవారికి దండం పెడుతూ.. తనకు శక్తిని ఇవ్వాలని కోరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సామ్ షేర్ చేస్తూ.. ” నేను నీ మాటను తీసుకున్నాను.. ధన్యవాదాలు దేవి.. మీ అందరికి నవరాత్రి శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సామ్ కు ధైర్యం, శక్తి నువ్వే ఇవ్వాలి  తల్లి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×