E-Paper
Advertisement

Prakash Raj: పవన్ కళ్యాణ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. ఏమైందంటే..?

Prakash Raj: పవన్ కళ్యాణ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. ఏమైందంటే..?

Prakash Raj:ప్రముఖ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీ.ఎమ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు అని ఆయన హితవు పలికారు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా..” మీ హిందీ భాషను మా వద్ద మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు.. స్వాభిమానంతో మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని.. పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ ” అంటూ దండం పెడుతున్న ఏమోజీ తో కామెంట్ చేశారు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

అసలేమైందంటే..

అసలేమైంది అనే విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇలా భగ్గుమన్నాయని చెప్పవచ్చు. నాడు పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ..” మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నాను అంటారు. అన్నీ దేశ భాషలే కదా .. తమిళనాడులో హిందీ రాకూడదని అంటుంటే, నాకు ఒకటే అనిపించింది. తమిళ్ సినిమాలు మరి హిందీలో డబ్బింగ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్గడ్, బీహార్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తాము అంటే ఎలా? ఇదెక్కడి న్యాయం.. తమిళనాడులో పెరిగినప్పుడు నేను వివక్షత అనుభవించాను. గోల్టీ, గోల్టీ అని నన్ను చాలామంది అవమానించారు కూడా..” అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.

ముదురుతున్న జాతీయ వివాదం..

ఇదిలా ఉండగా ఇంకొక వైపు విద్యా విధానంపై అటు తమిళనాడు, ఇటు కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మరో మలుపు తీసుకుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి గుర్తును తొలగించి ఆస్థానంలో ” రూ” మాత్రమే వచ్చేలా అక్షరాన్ని చేర్చడం జరిగింది. దీంతో తమిళ్, హిందీ భాషల మధ్య వివాదం మరింత ముదిరినట్టు అనిపించింది. ఇకపోతే మాతృభాషను కాపాడుకోవడానికి తీసుకున్న చర్యగా తమిళ సంఘాలు కూడా అభివర్ణించాయి. కానీ మరి కొంతమంది జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారనే కామెంట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలా వివాదం రోజు రోజుకి ముదురుతున్న నేపథ్యంలో తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్టుగా చేర్చడంపై డిఎంకె కూడా వ్యతిరేకిస్తూ కామెంట్ చేయగా.. సీఎం స్టాలిన్ కూడా దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు విద్యార్థులు ఎందుకు మూడో భాషను నేర్చుకోవాలి. ముఖ్యంగా ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషను నేర్పుతున్నారో మాకు చెప్పండి. ఆ తర్వాతే మేము ఆలోచిస్తాము. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధించి, ఇక్కడ మాత్రం మూడు భాషలను నేర్చుకోమని చెప్పడం ఎంతవరకు సమంజసం. అయినా ఇక్కడ విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది?” అంటూ కూడా ఆయన ప్రశ్నించారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×