E-Paper
Advertisement

Venkat Boyanapalli: ఆ ఇద్దరితో మల్టీస్టారర్ సినిమా నా కల

Venkat Boyanapalli: ఆ ఇద్దరితో మల్టీస్టారర్ సినిమా నా కల

Venkat Boyanapalli: సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘సైంధవ్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ చిత్ర నిర్మాత వెంకట్‌ బోయనపల్లి తాజాగా విలేకర్లతో ముచ్చటించారు. ఈ మేరకు ఆయనకు టాలీవులో ఇద్దరు హీరోలు ఇష్టమని చెప్పారు. అంతేకాకుండా ఆయన తొలి సినిమాగా వాళ్లిద్దరినీ కలిపి ఓ మల్టీస్టారర్‌ చేయాలనుకున్నట్లు తెలిపారు. అలా కుదరకపోవడంతో ఇప్పుడు వెంకటేశ్‌ 75వ సినిమాని నిర్మించే అవకాశం తనకు రావడం ఎంతో ఆనందంగా ఉందని.. అది అతని అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. అయితే ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు.. నేచురల్ స్టార్ నాని, విక్టరీ వెంకటేశ్‌లు.

నాని తనను నిర్మాతని చేశారని అన్నారు. ఆయనతో సినిమాలు చేశాక.. మరో ఇష్టమైన హీరో వెంకటేశ్‌తో సినిమా చేశానని తెలిపారు. అయితే ఆ ఇద్దరితో కలిపి ఓ మల్టీస్టారర్ సినిమా తీయాలనే తన కల నెరవేరలేదు అని అన్నారు. కానీ, అది ఎవరు తీసినా తనకు ఇష్టమేనంటూ చెప్పారు. వాళ్లిద్దరి కోసం తానుకూడా కథల్ని వెదుకుతున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌ చేస్తే ఇంకా సంతోషిస్తానని అన్నారు. ఇష్టమైన హీరోలు.. దర్శకులతో కలిసి సినిమాలు చేయడంలో ఉన్న ఆ ఆనందమే వేరు అని అన్నారు. ఇక నానితో ‘కృష్ణార్జున యుద్ధం’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చేశాక.. ఇప్పుడు వెంకటేశ్‌తో ‘సైంధవ్‌’ నిర్మించానని తెలిపారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×