Honduras: హోండూరస్లో వ్యవసాయ భూముల చిచ్చు మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో దుండగులు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో 16 మంది మృతువాత పడ్డారు. మృతుల్లో ఆరుగురు పోలీసులు ఉండడం తీవ్ర కలకలం రేపింది. అసలు హోండూరస్లో ఏం జరుగుతోంది.
హోండూరస్లో భూముల చిచ్చు ఉగ్రరూపం..
హోండూరాస్లో హింసాత్మక ఘటనలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఉత్తర ప్రాంతంలో రిగోరెస్లోని తాటి తోటలో పని చేస్తున్న వారిపై సాయుధులు కాల్పులు జరపారు. ఈ ఘటనలో 19 మంది కార్మికులు స్పాట్లో మృతి చెందారు. అందులో ఆరుగురు పోలీసులు కూడా ఉన్నారు. దుండగులు స్థానిక గ్యాంగ్లకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జరిగిన ఈ రెండు ఘటనలపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దశాబ్దాలుగా ఇక్కడి వ్యవసాయ భూములపై వివిధ వర్గాల వివాదం రాజుకుంటోంది. అక్కడి భూములపై నియంత్రణ సాధించాలని చూస్తున్నాయి సాయుధ శక్తులు. ఈ క్రమంలో స్థానిక రైతులు- కార్మికుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని వెళ్లగొడుతున్నారు.
16 మందిని చంపిన సాయుధులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ఈ క్రమంలో దుండగులు ప్రాణాంతక దాడులు దిగుతున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల నిపుణులు చెబుతున్నారు. కాల్పుల ఘటన తర్వాత హోండూరస్ సాయుధ దళాల సంయుక్త విభాగాధిపతి హెక్టర్ బెంజమిన్ వలేరియో ఆర్డాన్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీ చేశారు.
బాధ్యులను గుర్తించేందుకు పోలీసులకు అవసరమైన సిబ్బందిని అందిస్తుందని తెలిపింది. అటు హోండురాస్ జాతీయ పోలీసు ప్రతినిధి ఎడ్గార్డో బరహోనా మాట్లాడారు. ఆ ప్రదేశంలో 10 మంది కార్మికులు కాల్చి చంపారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. దుండగుల కోసం గాలింపు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.