E-Paper
Advertisement

హోండూరస్‌‌లో చిచ్చు మొదలైంది.. రెండు చోట్ల కాల్పులు, ఏకంగా 16 మంది మృతి

హోండూరస్‌‌లో చిచ్చు మొదలైంది..  రెండు చోట్ల కాల్పులు, ఏకంగా 16 మంది మృతి
Advertisement

Honduras: హోండూరస్‌లో వ్యవసాయ భూముల చిచ్చు మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో దుండగులు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో 16 మంది మృతువాత పడ్డారు. మృతుల్లో ఆరుగురు పోలీసులు ఉండడం తీవ్ర కలకలం రేపింది. అసలు హోండూరస్‌లో ఏం జరుగుతోంది.

హోండూరస్‌‌లో భూముల చిచ్చు ఉగ్రరూపం.. 

Advertisement

హోండూరాస్‌లో హింసాత్మక ఘటనలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఉత్తర ప్రాంతంలో రిగోరెస్‌లోని తాటి తోటలో పని చేస్తున్న వారిపై సాయుధులు కాల్పులు జరపారు. ఈ ఘటనలో 19 మంది కార్మికులు స్పాట్‌లో మృతి చెందారు. అందులో ఆరుగురు పోలీసులు కూడా ఉన్నారు. దుండగులు స్థానిక గ్యాంగ్‌లకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జరిగిన ఈ రెండు ఘటనలపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దశాబ్దాలుగా ఇక్కడి వ్యవసాయ భూములపై వివిధ వర్గాల వివాదం రాజుకుంటోంది. అక్కడి భూములపై నియంత్రణ సాధించాలని చూస్తున్నాయి సాయుధ శక్తులు. ఈ క్రమంలో స్థానిక రైతులు- కార్మికుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని వెళ్లగొడుతున్నారు.

Advertisement

16 మందిని చంపిన సాయుధులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

ఈ క్రమంలో దుండగులు ప్రాణాంతక దాడులు దిగుతున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల నిపుణులు చెబుతున్నారు. కాల్పుల ఘటన తర్వాత హోండూరస్ సాయుధ దళాల సంయుక్త విభాగాధిపతి హెక్టర్ బెంజమిన్ వలేరియో ఆర్డాన్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీ చేశారు.

బాధ్యులను గుర్తించేందుకు పోలీసులకు అవసరమైన సిబ్బందిని అందిస్తుందని తెలిపింది. అటు హోండురాస్ జాతీయ పోలీసు ప్రతినిధి ఎడ్గార్డో బరహోనా మాట్లాడారు. ఆ ప్రదేశంలో 10 మంది కార్మికులు కాల్చి చంపారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. దుండగుల కోసం గాలింపు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ALSO READ: బీజింగ్‌లో జిన్‌పింగ్‌-పుతిన్‌ భేటీ.. ఆపై ఉమ్మడి ప్రకటన, పశ్చిమాసియా యుద్ధం-ఏకఛత్రాధిపత్యంపై కీలక వ్యాఖ్యలు

Related News

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

బ్యాంకులు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్, నైట్‌క్లబ్‌లు ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు.. స్పాట్ రెజిస్ట్రేషన్..

Big Stories

Advertisement
×