E-Paper
Advertisement

హోండూరస్‌‌లో చిచ్చు మొదలైంది.. రెండు చోట్ల కాల్పులు, ఏకంగా 16 మంది మృతి

హోండూరస్‌‌లో చిచ్చు మొదలైంది..  రెండు చోట్ల కాల్పులు, ఏకంగా 16 మంది మృతి
Advertisement

Honduras: హోండూరస్‌లో వ్యవసాయ భూముల చిచ్చు మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో దుండగులు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో 16 మంది మృతువాత పడ్డారు. మృతుల్లో ఆరుగురు పోలీసులు ఉండడం తీవ్ర కలకలం రేపింది. అసలు హోండూరస్‌లో ఏం జరుగుతోంది.

హోండూరస్‌‌లో భూముల చిచ్చు ఉగ్రరూపం.. 

Advertisement

హోండూరాస్‌లో హింసాత్మక ఘటనలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఉత్తర ప్రాంతంలో రిగోరెస్‌లోని తాటి తోటలో పని చేస్తున్న వారిపై సాయుధులు కాల్పులు జరపారు. ఈ ఘటనలో 19 మంది కార్మికులు స్పాట్‌లో మృతి చెందారు. అందులో ఆరుగురు పోలీసులు కూడా ఉన్నారు. దుండగులు స్థానిక గ్యాంగ్‌లకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జరిగిన ఈ రెండు ఘటనలపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దశాబ్దాలుగా ఇక్కడి వ్యవసాయ భూములపై వివిధ వర్గాల వివాదం రాజుకుంటోంది. అక్కడి భూములపై నియంత్రణ సాధించాలని చూస్తున్నాయి సాయుధ శక్తులు. ఈ క్రమంలో స్థానిక రైతులు- కార్మికుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని వెళ్లగొడుతున్నారు.

Advertisement

16 మందిని చంపిన సాయుధులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

ఈ క్రమంలో దుండగులు ప్రాణాంతక దాడులు దిగుతున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల నిపుణులు చెబుతున్నారు. కాల్పుల ఘటన తర్వాత హోండూరస్ సాయుధ దళాల సంయుక్త విభాగాధిపతి హెక్టర్ బెంజమిన్ వలేరియో ఆర్డాన్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీ చేశారు.

బాధ్యులను గుర్తించేందుకు పోలీసులకు అవసరమైన సిబ్బందిని అందిస్తుందని తెలిపింది. అటు హోండురాస్ జాతీయ పోలీసు ప్రతినిధి ఎడ్గార్డో బరహోనా మాట్లాడారు. ఆ ప్రదేశంలో 10 మంది కార్మికులు కాల్చి చంపారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. దుండగుల కోసం గాలింపు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ALSO READ: బీజింగ్‌లో జిన్‌పింగ్‌-పుతిన్‌ భేటీ.. ఆపై ఉమ్మడి ప్రకటన, పశ్చిమాసియా యుద్ధం-ఏకఛత్రాధిపత్యంపై కీలక వ్యాఖ్యలు

Related News

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

అమెరికాలో షాకింగ్ ఘటన.. నువ్వు ముస్లిమా అంటూ, భారతీయుడ్ని 15 సార్లు కత్తితో పొడిచి..

Big Stories

Advertisement
×