E-Paper
Advertisement

Children in Disaster : విపత్తుల పడగలో చిన్నారులు

Children in Disaster : విపత్తుల పడగలో చిన్నారులు
Advertisement
Children in Disaster

Children in Disaster : ప్రకృతి వైపరీత్యాలు చిన్నారుల పాలిట శాపంలా మారాయి. తుఫాన్లు, వరదలు, కార్చిచ్చు వంటి విపత్తులతో వారికి స్థానచలనం తప్పడం లేదు. యునిసెఫ్ లెక్కల మేరకు 2016-21 మధ్య 43.1 మిలియన్ల మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు.

వాతావరణ మార్పుల కారణంగా ఇలా బాధితులయ్యే చిన్నారుల సంఖ్య వచ్చే మూడు దశాబ్దాల్లో 113 మిలియన్లకు చేరుతుందని అంచనా. ప్రకృతి ప్రకోపం కారణంగా ఫిలిప్పీన్స్‌లో అత్యధిక సంఖ్యలో చిన్నారులు సొంతూరును వదిలేయాల్సి వచ్చింది.

Advertisement

ఇలా దాదాపు 10 మిలియన్ల మంది వలస బాట పట్టారు. భారత్ రెండో స్థానంలో నిలిచింది. 6.7 మిలియన్ల మంది చిన్నారులు నిరాశ్రయులయ్యారు. 6.4 మిలియన్ల మందితో చైనా మూడో స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు నిరాశ్రయులు కావడానికి ప్రధాన కారణం తుఫాన్లు, వరదలు.

ఫలితంగా ఆ ఆరేళ్ల కాలంలో దాదాపు 21.1 మిలియన్ల మంది ఆశ్రయం కోల్పోయారు.
ఇక అమెరికాలో ప్రధానంగా తుఫాన్లు, ఆ తర్వాత కార్చిచ్చుల వల్ల పిల్లలు నిలువనీడను కోల్పోతున్నారు. అలా అగ్రరాజ్యంలో 1.7 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.

Advertisement

చైనాలో 6.4 మిలియన్ల మంది, సోమాలియాలో 1.7, ఇథియోపియా 1.3, ఇండొనేసియాలో 1 మిలియన్ మంది చిన్నారులకు ఆశ్రయం కరువైంది. ప్రకృతి వైపరీత్యాలతో కుటుంబాలు కకావికలమై.. సర్వం కోల్పోతున్న పిల్లలు దోపిడీ, లైంగిక దాష్టీకాలకు గురవుతున్నారు.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×