E-Paper
Advertisement

Children in Disaster : విపత్తుల పడగలో చిన్నారులు

Children in Disaster : విపత్తుల పడగలో చిన్నారులు
Advertisement
Children in Disaster

Children in Disaster : ప్రకృతి వైపరీత్యాలు చిన్నారుల పాలిట శాపంలా మారాయి. తుఫాన్లు, వరదలు, కార్చిచ్చు వంటి విపత్తులతో వారికి స్థానచలనం తప్పడం లేదు. యునిసెఫ్ లెక్కల మేరకు 2016-21 మధ్య 43.1 మిలియన్ల మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు.

వాతావరణ మార్పుల కారణంగా ఇలా బాధితులయ్యే చిన్నారుల సంఖ్య వచ్చే మూడు దశాబ్దాల్లో 113 మిలియన్లకు చేరుతుందని అంచనా. ప్రకృతి ప్రకోపం కారణంగా ఫిలిప్పీన్స్‌లో అత్యధిక సంఖ్యలో చిన్నారులు సొంతూరును వదిలేయాల్సి వచ్చింది.

Advertisement

ఇలా దాదాపు 10 మిలియన్ల మంది వలస బాట పట్టారు. భారత్ రెండో స్థానంలో నిలిచింది. 6.7 మిలియన్ల మంది చిన్నారులు నిరాశ్రయులయ్యారు. 6.4 మిలియన్ల మందితో చైనా మూడో స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు నిరాశ్రయులు కావడానికి ప్రధాన కారణం తుఫాన్లు, వరదలు.

ఫలితంగా ఆ ఆరేళ్ల కాలంలో దాదాపు 21.1 మిలియన్ల మంది ఆశ్రయం కోల్పోయారు.
ఇక అమెరికాలో ప్రధానంగా తుఫాన్లు, ఆ తర్వాత కార్చిచ్చుల వల్ల పిల్లలు నిలువనీడను కోల్పోతున్నారు. అలా అగ్రరాజ్యంలో 1.7 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.

Advertisement

చైనాలో 6.4 మిలియన్ల మంది, సోమాలియాలో 1.7, ఇథియోపియా 1.3, ఇండొనేసియాలో 1 మిలియన్ మంది చిన్నారులకు ఆశ్రయం కరువైంది. ప్రకృతి వైపరీత్యాలతో కుటుంబాలు కకావికలమై.. సర్వం కోల్పోతున్న పిల్లలు దోపిడీ, లైంగిక దాష్టీకాలకు గురవుతున్నారు.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×