E-Paper
Advertisement

Hezbollah Commander Killed: ఇజ్రాయెల్ మెరుపుదాడులు, హిజ్బుల్లా టాప్ కమాండర్ హతం!

Hezbollah Commander Killed: ఇజ్రాయెల్ మెరుపుదాడులు, హిజ్బుల్లా టాప్ కమాండర్ హతం!
Advertisement

Hezbollah Commander Killed: ఇజ్రాయెల్-గాజా వార్ క్లయిమాక్స్‌కు చేరినట్టేనా? ఇజ్రాయెల్ పంతం నెగ్గిందా? హిజ్బుల్లా టాప్ కమాండర్ హతమయ్యాడా? ఈ వార్‌కు ఫుల్‌స్టాప్ పడినట్టేనా? ఇవే ప్రశ్నలు పలు దేశాలను వెంటాడుతున్నాయి.

గాజాలో హిజ్బుల్లా మిలిటరీ స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బీరుట్‌‌లో జరిపిన వైమానిక దాడుల్లో హిజ్బులా టాప్‌ కమాండర్‌ ఫువాద్‌ షుక్ర్‌ను హత మార్చినట్టు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. ఇటీవల సాకర్ మైదానంలో జరిగిన దాడుల్లో 12 మంది చిన్నారుల మరణాలకు కారకుడు పువాద్ అని తెలిపింది. గాజాతో వార్ మొదలైనప్పటి నుంచి హిజ్బుల్లా దాడులకు పువాద్ నాయకత్వం వహించాడు.

Advertisement

పువాద్ షుక్ర్‌‌పై అమెరికాలో గతంలో రివార్డు ప్రకటించింది. లెబనాన్ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థలో సుదీర్ఘం గా పనిచేస్తున్నాడు పువాద్ షుక్ర్. అంతేకాదు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి కూడా. అయితే 1983లో బీరుట్‌ లో అమెరికా మెరైన్‌ కార్ప్స్‌ బ్యారక్స్‌పై దాడిలో ఫువాద్ కీలకపాత్ర పోషించాడు. ఆ ఘటనలో 24 మంది అమెరికా సైనికులు మరణించారు. షుక్ర్ గురించి సమాచారం ఇస్తే ఐదు మిలియన్లు రివార్డు ఇస్తామని గతంలో అమెరికా ప్రకటించిన విషయం తెల్సిందే.

ALSO READ: బ్రిటన్​లో ఉన్మాది దాడి, ముగ్గురు చిన్నారులు మృతి, పలువురి పరిస్థితి విషమం

Advertisement

ఇజ్రాయెల్ ప్రకటనను హెజ్బుల్లా వర్గాలు తోసిపుచ్చాయి. షుక్ర్‌‌కు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపాయి. ఆయన్ని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రాణాలతో బయటపడ్డాడని గుర్తు చేసింది. మరోవైపు ఇరాన్ మద్దతు గల ఉగ్రవాదులకు గట్టి పట్టున్న ప్రాంతం. అయితే ఇజ్రాయెల్ ఆక్ర్మిత గోలన్ హైట్స్‌లో దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని లెబనాన్ పేర్కొంది.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×