E-Paper
Advertisement

Texas accident: టెక్సాస్‌లో దారుణం.. ఎన్నారై ఫ్యామిలీ, ముగ్గురు మృతి.. ఏం జరిగిందంటే..

Texas accident: టెక్సాస్‌లో దారుణం.. ఎన్నారై ఫ్యామిలీ, ముగ్గురు మృతి.. ఏం జరిగిందంటే..
Advertisement

Texas accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారత సంతతి అరవింద్ మణి ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో కొడుకు అక్కడ లేడు.

టెక్సాస్‌లోని లాంపాసాప్ కౌంటీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎన్నారై ఫ్యామిలీకి చెందిన ముగ్గురు కుటుంబసభ్యులు స్పాట్‌లో మృతి చెందారు. వారిలో అరవింద్ మణి (45), ప్రదీపా అరవింద్ (40), ఆండ్రిల్ అరవింద్ (17) ఉన్నారు. అయితే వీరికి 14 ఏళ్ల కొడుకు ఆదిరియన్ ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కొడుకు వాహనంలో లేడు.

Advertisement

అరవింద్ మణి ప్రయాణిస్తున్న కారును, ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. ఆ కారు వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని టెక్సాస్ డిపార్టెమెంట్ ఆప్ ఫబ్లిక్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు కార్లకు సంబంధించి మొత్తం ఐదుగురు మృతి చెందగా, అందులో మణి కుటుంబసభ్యులు ముగ్గురు ఉన్నారు.

ALSO READ: అమెరికాలోనూ..వేణుస్వామి వారసురాలు? ఎవరు గెలుస్తారో చెప్పేసింది

Advertisement

అతి వేగమే ఈ ఘటనకు కారణమైందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నమాట. గడిచిన 26 ఏళ్లలో ఆ తరహా ప్రమాదం జరగలేదని అంటున్నారు. అరవింద్ మణి కూతురు ఆండ్రిల్‌ రీసెంట్‌గా హైస్కూల్ పూర్తి చేసింది. డల్లాస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదవాలని భావిస్తోంది. ఇంతలో ఈ లోకాన్ని విడిచిపెట్టింది. అరవింద్ మణి కొడుకు ఆదిరియన్ తొమ్మిది చదువుతున్నాడు. ప్రమాదంలో కుటుంబ సభ్యులు చనిపోవడంతో ఒంటరివాడయ్యాడు.

 

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×