E-Paper
Advertisement

Texas accident: టెక్సాస్‌లో దారుణం.. ఎన్నారై ఫ్యామిలీ, ముగ్గురు మృతి.. ఏం జరిగిందంటే..

Texas accident: టెక్సాస్‌లో దారుణం.. ఎన్నారై ఫ్యామిలీ, ముగ్గురు మృతి.. ఏం జరిగిందంటే..
Advertisement

Texas accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారత సంతతి అరవింద్ మణి ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో కొడుకు అక్కడ లేడు.

టెక్సాస్‌లోని లాంపాసాప్ కౌంటీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎన్నారై ఫ్యామిలీకి చెందిన ముగ్గురు కుటుంబసభ్యులు స్పాట్‌లో మృతి చెందారు. వారిలో అరవింద్ మణి (45), ప్రదీపా అరవింద్ (40), ఆండ్రిల్ అరవింద్ (17) ఉన్నారు. అయితే వీరికి 14 ఏళ్ల కొడుకు ఆదిరియన్ ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కొడుకు వాహనంలో లేడు.

Advertisement

అరవింద్ మణి ప్రయాణిస్తున్న కారును, ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. ఆ కారు వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని టెక్సాస్ డిపార్టెమెంట్ ఆప్ ఫబ్లిక్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు కార్లకు సంబంధించి మొత్తం ఐదుగురు మృతి చెందగా, అందులో మణి కుటుంబసభ్యులు ముగ్గురు ఉన్నారు.

ALSO READ: అమెరికాలోనూ..వేణుస్వామి వారసురాలు? ఎవరు గెలుస్తారో చెప్పేసింది

Advertisement

అతి వేగమే ఈ ఘటనకు కారణమైందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నమాట. గడిచిన 26 ఏళ్లలో ఆ తరహా ప్రమాదం జరగలేదని అంటున్నారు. అరవింద్ మణి కూతురు ఆండ్రిల్‌ రీసెంట్‌గా హైస్కూల్ పూర్తి చేసింది. డల్లాస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదవాలని భావిస్తోంది. ఇంతలో ఈ లోకాన్ని విడిచిపెట్టింది. అరవింద్ మణి కొడుకు ఆదిరియన్ తొమ్మిది చదువుతున్నాడు. ప్రమాదంలో కుటుంబ సభ్యులు చనిపోవడంతో ఒంటరివాడయ్యాడు.

 

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×