BigTV English

Biden’s Son Hunter: ఎన్నికల వేళ.. బైడెన్‌కు ఊహించని షాక్.. దోషిగా తేలిన కొడుకు హంటర్‌!

Biden’s Son Hunter: ఎన్నికల వేళ.. బైడెన్‌కు ఊహించని షాక్.. దోషిగా తేలిన కొడుకు హంటర్‌!

Biden’s son Hunter: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న జో బైడెన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తుపాకీ కొనుగోలు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో బైడెన్ కొడుకు హంటర్ దోషిగా తేలాడు. ముఖ్యంగా హంటర్‌పై మోసిన అభియోగాల్లో నేర నిర్ధారణ అయ్యింది. అయితే న్యాయస్థానం శిక్షా కాలాన్ని మాత్రం వెల్లడించలేదు.


ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం డెలావెర్‌లోని విల్మింగ్టన్ కోర్టు హంటర్ నేరాన్ని నిర్థారించిం ది. అయితే ఇలాంటి కేసులో దాదాపు 25 ఏళ్ల వరకు జైలుశిక్ష పడనుంది. మొదటిసారి కావడంతో తక్కువ శిక్ష పడవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నమాట. ఎప్పటి నుంచి శిక్ష అమలు చేసేదీ కూడా చెప్ప లేదు. తీర్పు వెలువడిన వెంటనే హంటర్ భావోద్వేగానికి గురయ్యారు.

కేసు విచారణ సందర్భంగా బైడెన్ వైఫ్, హంటర్ తల్లి జిల్ బైడెన్ కోర్టుకు వచ్చారు. న్యాయస్థానం తీర్పు తర్వాత అక్కడి అక్కడి నుంచి భార్య, తల్లితో కలిసి హంటర్ వెళ్లిపోయాడు. మాట్లాడాలని మీడియా రిక్వెస్ట్ చేసినప్పటికీ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. తీర్పును అంగీకరిస్తున్నానని, కొడుకు తరపున క్షమాభిక్ష కోరబోనని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు.


Also Read: ఘోర విషాదం.. 49 మంది మృతి

ఇంతకీ అసలు కేసు ఏంటి? 2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలర్‌కు ఇచ్చిన పేపర్‌లో హంటర్ తప్పుడు సమాచారం ఇచ్చారు. తన వద్ద అక్రమంగా ఆయుధాలు లేవని వెల్లడించారు. అది ముమ్మాటికీ తప్పుగా వర్ణించింది న్యాయస్థానం. ఇదే కాకుండా హంటర్‌పై మరో కేసు కూడా ఉంది. కాలిఫోర్నియాలో పన్ను ఎగవేత కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్‌లో ఈ కేసు విచారణకు రానుంది.

Tags

Related News

Nobel Prize Economics: ఎకానమీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్.. వారు ఏ దేశాలంటే..?

California: చెట్టును తాకి లైవ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

Americal News: అమెరికాలో మళ్లీ.. ఓ పాఠశాల కాల్పుల కలకలం, ఆరుగురు మృతి

Japan Flu Outbreak: జపాన్ లో విజృంభిస్తోన్న ఫ్లూ మహమ్మారి.. 4 వేలకు పైగా కేసులు, స్కూళ్లు మూసివేత

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Big Stories

×