Big Stories

Boat Capsized at Yemen Coast: యెమెన్ సమీపంలో పడవ బోల్తా.. 49 మంది మృతి!

49 Killed in Boat Capsized at Yemen Coast: యెమెన్ సమీపంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి 49 మంది మృతిచెందారు. మరో 140 మంది వరకు తప్పిపోయారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

- Advertisement -

వలసదారులతో వెళ్తున్న పడవ యెమెన్ సమీపంలో బోల్తా పడింది. దీంతో పడవలో ప్రయాణిస్తున్న 49 మంది కూలీలు మృతిచెందారు. మరో 140 మంది వరకు నీటిలో మునిగిపోయారు. అంతర్జాతీయ వలస సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 260 మంది సోమాలియాలు, ఇథియోపియన్ లతో గల్ఫ్ ఆఫ్ అడెన్ మీదుగా పడవ వెళ్తున్న క్రమంలో సోమవారం మునిగిపోయింది. సెర్చ్ ఆపరేషన్ చేసి 71 మందిని రక్షించారు.

- Advertisement -

Also Read: సైన్యం దూసుకొస్తే.. బందీలను కాల్చివేయండి: హమాస్ హెచ్చరిక !

అయితే, ఆఫ్రికాలో పేదరికం కారణంగా పని కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తుంటారు. ఇలా వలసదారులు యెమెన్ మీదుగా తరచుగా వెళ్లే మార్గాలలో ఒకటి. యెమెన్ ఒక దశాబ్దానికి పైగా రక్తపాత అంతర్యుద్ధంలో మునిగిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News