E-Paper
Advertisement

Americal News: అమెరికాలో మళ్లీ.. ఓ పాఠశాల కాల్పుల కలకలం, ఆరుగురు మృతి

Americal News: అమెరికాలో మళ్లీ..  ఓ పాఠశాల కాల్పుల కలకలం, ఆరుగురు మృతి
Advertisement

Americal News: అమెరికాలో గన్ కల్చర్ అక్కడివారిని బెంబేలెత్తిస్తోంది. రెండు లేదా మూడు రోజుల కొకసారి తుపాకీ కాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మిస్సిస్సిప్పి రాష్ట్రంలోని లేలాండ్ సిటీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ పాఠశాల సమీపంలో ఈ ఘటన కాల్పుల్లో స్పాట్‌లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. 12 మందికి గాయపడగా, వారిలో కొందరు పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు సమాచారం.

అమెరికాలో కాల్పుల కలకలం

Advertisement

అమెరికా కాలమాన ప్రకారం.. శుక్రవారం రాత్రి మిస్సిస్సిప్పి‌లోని లేలాండ్ నగరంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ స్కూల్‌ సమీపంలో పాఠశాలల పూర్వ విద్యార్థులను స్వాగతించే కార్యక్రమం జరిగింది. అమెరికన్ సంప్రదాయ ఫుట్‌బాల్, ఇతర కమ్యూనిటీ ఈవెంట్‌లు జరిగాయి. ఫుట్‌బాల్ గేమ్ ముగిసిన తర్వాత 18 ఏళ్ల యువకుడు గన్‌తో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో స్పాట్‌లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరో 12 మంది గాయపడ్డారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నమాట. కాల్పుల ఘటనతో ఆ స్కూల్ వేడుక కాస్త విషాదంగా మారింది. ఫుట్‌బాల్ గేమ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లతోపాటు స్థానికులు ఆ సమయంలో గుమిగూడారు.

Advertisement

ఆరుగురు మృతి, డజనుకుపైగా గాయాలు

ఆ సమయంలో ఓ యువకుడు కాల్పులు జరిపారు. దాదాపు 20 మంది గాయపడ్డారని ఆ రాష్ట్ర సెనేటర్ తెలిపారు. తీవ్రంగా గాయపడినవారిని సమీపంలోని గ్రీన్‌విల్లే ఆసుపత్రి నుండి జాక్సన్‌లోని మరో ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. నిందితులను ఇప్పటివరకు అరెస్ట్‌ చేయలేదని నగర మేయర్ తెలిపారు. ఈ ఘటనలో దర్యాప్తును కొనసాగుతోంది.

ALSO READ: జపాన్ లో విజృంభిస్తున్న ఫ్లూ మహమ్మారి

నిందితుల్ని గుర్తించేందు ప్రత్యక్షసాక్షులు ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాల్పులు జరిపింది 18 ఏళ్ల యువకుడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఆ తరహా ఘటనలు జరగలేదని చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన ఆనవాళ్లు ఆ పాఠశాల్లో కనపించలేదు.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×