E-Paper
Advertisement

CBSE 10th Exam: దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పదో, ఇంటర్ తరగతి పరీక్షలు.. అమల్లోకి కొత్త రూల్స్

CBSE 10th Exam:  దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పదో, ఇంటర్ తరగతి పరీక్షలు.. అమల్లోకి కొత్త రూల్స్

CBSE 10th Exam: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో మంగళవారం నుంచి CBSE బోర్డు పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి.  ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు పరీక్షలు జరుగుతాయి.  జాతీయ విద్యా విధానం ఈసారి నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఈ ఏడాది నుంచి విద్యార్థులు రెండు విడతల్లో పరీక్షలు రాయవచ్చు. దీనిపై క్లారిటీ ఇచ్చింది CBSE బోర్డు.

దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పదో, ఇంటర్ తరగతి పరీక్షలు

దేశవ్యాప్తంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మంగళవారం నుంచి మొదలయ్యాయి. లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. దాదాపు 43 లక్షలకు పైగా విద్యార్థులు హాజరు కానున్నారు. CBSE వివరాల మేరకు 10వ తరగతి పరీక్షకు 25 లక్షల పైచిలుకు విద్యార్థులు హాజరు కానున్నారు. ఇక ఇంటర్‌కు సంబంధించి 18 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

CBSE 10వ తరగతి పరీక్ష 2026 ఫిబ్రవరి 17 నుండి మార్చి ఏడు వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 17- మేథ్స్ పరీక్ష జరగనుంది. ఫిబ్రవరి 21న ఇంగ్లీష్ లేదా, కమ్యూనికేటివ్, భాష, సాహిత్యం పరీక్ష జరగనుంది. ఫిబ్రవరి 25న సైన్స్, ఫిబ్రవరి 26న హోమ్ సైన్స్ పరీక్ష జరగనుంది. అలాగే మార్చి 2న హిందీ, ఎ, బి, మార్చి 7న సోషల్ సైన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

పదో తరగతి విద్యార్థులకు కొత్త రూల్స్ అమల్లోకి

CBSE పదో తరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం వెల్లంచింది. ఈ ఏడాది నుంచి పరీక్షలు రెండు విడతల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలపై బోర్డు క్లారిటీ ఇచ్చింది.తొలి విడత ఫిబ్రవరిలో జరుగుతున్న పరీక్షకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలి. తొలి విడత రాయకుండా నేరుగా మే నెలలో జరగనున్న రెండో విడత రాస్తామన్న విద్యార్థుల అభ్యర్థనను బోర్డు తిరస్కరించింది.

మొదటి విడతలో మూడు సబ్జెక్టులలో హాజరు కాని వారిని ‘ఎసెన్షియల్ రిపీట్’ కేటగిరీలో ఉంచుతామని తెలిపింది. వీరంతా రెండో విడతకు అనర్హత కోల్పోతాు. వీరంతా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పరీక్షలు రాయాలి. ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులను ‘కంపార్ట్‌మెంట్’ కేటగిరీ కింద పరిగణిస్తారు. రెండో విడతలో పరీక్ష రాసేందుకు వీరికి అవకాశం కల్పిస్తారు.

ALSO READ: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ప్రభంజనం

విద్యార్థులు తమ మార్కులను పెంచుకోవాలనుకుంటే గరిష్టంగా మూడు సబ్జెక్టుల వరకు రెండో విడత పరీక్షలు రాసుకోవచ్చు. CBSE 12వ తరగతి పరీక్ష ఫిబ్రవరి 17 నుండి ఏప్రిల్ 9 వరకు జరుగుతాయి. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతాయి. మరియు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.ఫిబ్రవరి 20న ఫిజిక్స్ కాగా, ఏప్రిల్ 4న సామాజిక శాస్త్రం పరీక్ష జరగనుంది.

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×