E-Paper
Advertisement

Human Evolution : కోతి నుండి మనిషి వచ్చాడా..? ఆధారం ఏంటంటే..?

Human Evolution : కోతి నుండి మనిషి వచ్చాడా..? ఆధారం ఏంటంటే..?

Human Evolution : ఆదిమానవుడు అనేవాడు కోతి నుండి వచ్చాడు అని సైన్స్ చెప్తుంది. అది నిజం కాదు అని వాదించేవారు కూడా ఉన్నారు. ముందుగా తెలివి వచ్చిన ఆదిమానవుడు రెండు రాళ్లతో నిప్పును సృష్టించాడు. అలా ఆదిమానవుడు చేసిన ఎన్నో ప్రయోగాలకు ఇప్పుడు టెక్నాలజీని జతచేర్చి మరింత మెరుగ్గా ఉపయోగిస్తున్నాం. అయితే అప్పటినుండి ఇప్పటివరకు సైన్స్ ఎలా మారింది, ఆదిమానవుడి నుండి తెలివైన మనిషి ఎలా బయటికి వచ్చాడు తాజా స్టడీలో తేలింది.

ఇప్పటిలాగా అప్పట్లో నగరాలు, ఎత్తైన బిల్డింగులు లేకపోవడంతో కోతుల రూపంలో ఉన్న మనిషి అడవుల్లో జీవిస్తూ నాలుగు కాళ్లపై నడిచేవాడు. మెల్లగా మనుషులు పెరగడం, చెట్లను నరికేయడం మొదలుపెట్టిన తర్వాత అడవులు ఎండిపోవడం మొదలయ్యింది. భూమిపై గడ్డి ఎక్కువగా పెరిగింది. అదే సమయంలో కోతులు మెల్లగా నాలుగు కాళ్లతో కాకుండా రెండు కాళ్లతో నడవడం మొదలుపెట్టాయి. కానీ కేవలం దానివల్లే కోతుల నడక మారింది అనడం కరెక్ట్ కాదని కొందరు శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నారు.

ఆదిమానవుడి కాలంలో రెండు రకాలు భూములు ఉండేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవే గడ్డి భూములు, పొదలు. వారు స్టడీ చేసినదానింటే 10 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి ఇవి ఉన్నాయని భావిస్తున్నారు. అయితే అడవుల్లో బ్రతికే కోతులు పండ్లను తింటూ పెరిగితే.. గడ్డిభూముల్లో నివసించిన కోతులు ఆకులను తింటూ పెరిగాయని వారు అనుమానిస్తున్నారు. అలా మెల్లగా కొన్ని కోతులు మనిషిలాగా మారాయని వారి అంచనా.

ఆదిమానవుడు గురించి, అంతకు ముందు నివసించిన కోతుల గురించి దాదాపు గత పదేళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనల కోసం చాలా ఏళ్ల క్రితానికి చెందిన చెట్లను శాస్త్రవేత్తలు సేకరించారు. ఆ చెట్లలో సీ4 చెట్లు అనేవి ఎన్నో ఏళ్లుగా ఎకోసిస్టమ్‌కు తోడ్పడుతున్నాయని గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే గడ్డిభూములు, పొదలు అనేవి శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే చాలా ముందు నుండే ఉన్నాయన్న వారి అంచనా నిజమయ్యింది.

ఆదిమానవుడు కంటే ముందు జీవించిన కోతులను మోరోటోపైథెసస్ అంటారు. అవి దట్టమైన అడవుల్లో జీవించేవి కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎక్కువగా గడ్డిభూముల్లోనే వాటి జీవనాన్ని కొనసాగించాయని తెలిపారు. మోరోటోపైథెసస్‌పై వారు చేసిన పరిశోధనల్లో అవి గడ్డి కాకుండా పండ్లను తిరిగే పెరిగాయని నిరూపణ అయ్యిందన్నారు. అంటే ఇవే మెల్లగా ఆదిమానవుడిలాగా, మనిషిలాగా మారాయని దాదాపు నిర్ధారణకు వచ్చారు శాస్త్రవేత్తలు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×