BigTV English

Nara Lokesh : తహసీల్దార్ ను హత్య చేసింది ఆ నేతలే..? లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..

Nara Lokesh : తహసీల్దార్ ను హత్య చేసింది ఆ నేతలే..? లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..

Nara Lokesh : జ‌గ‌న్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. వైసీపీ పాల‌న‌ని అంత‌మొందిచేందుకు ఉద్యోగులంతా ఆత్మస్థైర్యంతో ఉండాలని కోరారు.


విశాఖ‌ జిల్లాలో భూ అక్రమాల‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని వైసీపీ నేత‌లే త‌హ‌సీల్దార్ రమణయ్యను అత్యంత‌ దారుణంగా హత్య చేశారని లోకేశ్ ఆరోపించారు. అవినీతి, అక్రమాలు, వేధింపుల‌తో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవ‌డం విచార‌క‌రమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారం కోసం జగన్ సొంత బాబాయ్‌నే హత్య చేశారని లోకేశ్ ఆరోపించారు. జ‌గ‌న్ గ్యాంగ్ త‌మ దోపిడీకి స‌హ‌క‌రించ‌ని ఉద్యోగుల అడ్డు తొల‌గించుకుంటోందన్నారు. వైసీపీ నేత‌ల అవినీతికి వారెందుకు బ‌లి కావాలని ప్రశ్నించారు.


జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో వంద‌ల మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయరని లోకేశ్ ఆరోపించారు. ఈ వారంలోనే ముగ్గురు ఉద్యోగులు బలి అయ్యారని తెలిపారు. ఈ ఫ్యాక్షన్ స‌ర్కారు అంతానికి ఇంకా 2 నెల‌లే స‌మ‌యం ఉందన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షిస్తామని లోకేష్‌ స్పష్టం చేశారు.

Related News

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Big Stories

×