BigTV English
Advertisement

Eluru : పండుగ పూట విషాదం.. ముగ్గు వేస్తున్న యువతులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి..

Eluru : పండుగ పూట విషాదం.. ముగ్గు వేస్తున్న యువతులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి..

Eluru : యువతుల సందడి మధ్య , ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. యువతులు ఇంటి ముందు ముత్యాల ముగ్గులతో వాకిళ్లను నింపుతున్నారు. ఇలాంటి ఆనంద వేడుకల సమయంలో ఓ విషాదం చోటుచేసుకుంది. ముగ్గు వేస్తున్న అక్కాచెల్లెళ్ల పైకి లారీ దూసుకెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా మండపల్లి మండలం కానుకొల్లులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం భోగి పండుగ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న యువతులపైకి.. ఇటుకల లోడుతో గుడివాడ నుంచి కైకలూరు వెళ్తున్న లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది.


ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని(17) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందాగా.. మరో యువతి పల్లవి దుర్గ(18)కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరార్ అయ్యాడు. లారీలో ఉన్న మరో వ్యక్తిని పట్టుకొని గ్రామస్తులు చితకబాది పోలీసులకు పట్టించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సింది.


Related News

Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Gujarat Crime: పెట్రోల్ పంప్ ఓనర్ ఇంట్లో దారుణం.. కూతుళ్లతో కలిసి తండ్రి ఆత్మహత్య, కెనాల్‌లో మృతదేహాలు

Crime News: దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..

Konaseema Crime: రామచంద్రాపురం బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. దొంగతనానికి వచ్చి చిన్నారి హత్య

Srisailam Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు

Tirupati Crime: ఆ ఫ్యామిలీలో చిచ్చు.. విసిగిపోయిన ఆ తల్లి, పిల్లలతో కలిసి ఆత్మహత్య

Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన తుఫాన్ వాహనం.. స్పాట్‌లో నలుగురు

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Big Stories

×