BigTV English

Eluru : పండుగ పూట విషాదం.. ముగ్గు వేస్తున్న యువతులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి..

Eluru : పండుగ పూట విషాదం.. ముగ్గు వేస్తున్న యువతులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి..

Eluru : యువతుల సందడి మధ్య , ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. యువతులు ఇంటి ముందు ముత్యాల ముగ్గులతో వాకిళ్లను నింపుతున్నారు. ఇలాంటి ఆనంద వేడుకల సమయంలో ఓ విషాదం చోటుచేసుకుంది. ముగ్గు వేస్తున్న అక్కాచెల్లెళ్ల పైకి లారీ దూసుకెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా మండపల్లి మండలం కానుకొల్లులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం భోగి పండుగ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న యువతులపైకి.. ఇటుకల లోడుతో గుడివాడ నుంచి కైకలూరు వెళ్తున్న లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది.


ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని(17) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందాగా.. మరో యువతి పల్లవి దుర్గ(18)కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరార్ అయ్యాడు. లారీలో ఉన్న మరో వ్యక్తిని పట్టుకొని గ్రామస్తులు చితకబాది పోలీసులకు పట్టించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సింది.


Related News

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

kolkata: కోల్‌క‌తాలో భారీ వ‌ర్షం.. ఐదుగురు మృతి!

Building Collapse: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు సజీవ సమాధి

Big Stories

×